Erragadda foot over Bridge: హైదరాబాద్ లో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నగరంలోని పాదచారుల భద్రత కోసం ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని ఇవాళ ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. నగరవ్యాప్తంగా 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. అయితే.. ఇప్పటివరకు రూ.75.65 కోట్ల అంచనా వ్యయంతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు.
Read also: Minister Kakani Govardhan Reddy: ప్రభుత్వంపై పథకం ప్రకారం దుష్ప్రచారం
ఇందులో ఇప్పటి వరకు 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు అందుబాటులోకి వచ్చాయి. ఇక, మిగిలినవాటి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. సుమారు రూ.5 కోట్ల వ్యయంతో స్టేర్ కాస్, లిఫ్ట్ గా, ఎస్కలేటర్, షెల్టర్ వాక్ వేతో పాటు మెరుగైన లైటింగ్, భద్రత సౌకర్యాలతో దీనిని నిర్మించారు.
Buffalo Died: నాగేదె చనిపోవడానికి కారణం హెలికాప్టర్.. పోలీసులకు ఫిర్యాదు
