Vote Selfie: ఓటేస్తూ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటే.. చిక్కుల్లో పడ్డట్లే..!
Vote Selfie: ఓటింగ్ అనేది అత్యంత రహస్య ప్రక్రియ. ఓటర్లు నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ.. వేసిన ఓటు ఎవరికి వేసారో అత్యంత రహస్యంగా ఉంచి ఓటరు మహాశయుని హక్కుకు భంగం కలగకుండా చూడాలి. అయితే కొందరు ఓటు వేసిన తరువాత బ్యాలెడ్ బాక్స్ దగ్గరే నిలబడి సెల్ఫీ ఫోటోలు తీస్తూ.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరొకొందరైతే.. ఓటేస్తూ సెల్ఫీలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో వైరల్ అవడానికి పోస్ట్ చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు. అలాంటిది ఇప్పుడు అలా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారో నేరుగా జైలుకే వెళ్లాల్సి వస్తుంది. యస్ మీరు విన్నది నిజమే.
ఇక మరోవైపు సోషల్ మీడియా వినియోగం పెరగడంతో సెల్ఫీలు దిగి ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇక కూర్చున్నా, నిల్చున్నా, తింటున్నా.. ఇలా చేసే పనేదైనా సెల్ఫీ దిగడం ఆనవాయితీగా మారిపోతుంది. దిగిన సెల్పీని స్నేహితులతో పంచుకోవడం ఎక్కువైంది. నిషేధిత ప్రాంతాల్లోనూ సెల్ఫీలు దిగుతున్న వారు కోకొల్లలు. అయితే.. ఈ అలవాటును ఓటేసేటప్పుడు చూపించొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ దిగడం వరకు ఓకే కానీ.. లోపలికి ఫోన్ తీసుకెళ్లినా, ఓటేస్తూ ఫొటో దిగినా చిక్కుల్లో పడతారని అధికారులు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడంపై ఎలక్షన్ కమిషన్ బ్యాన్ విధించింది. పొరపాటున లేక సిబ్బంది కళ్లుగప్పి లోపలికి ఫోన్ తీసుకెళ్లి సెల్ఫీ దిగారో ఇక మీ జీవితం జైలుపాలవుతారని హెచ్చరిస్తుంది.
Also Read
- TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
మీరు.. ఓటేస్తూ సెల్ఫీ దిగినా.. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినా మీ ఓటును పరిగణనలోకి తీసుకోరని తెలిపింది. కాగా.. నిబంధనలు అతిక్రమించినందుకు పోలీస్ కేసు నమోదు చేస్తారు. అంతేకాదండోయ్.. ఆపై జైలుకెళ్లడం, కోర్టుల చుట్టూ తిరగడం తప్పదు. ఇక మరోవైపు, కళ్లు కనిపించని వారు ఓటేసేందుకు సహాయకుడిని అనుమతిస్తామని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. కాగా.. అప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తినే సహాయకుడిగా అంగీకరిస్తామని చెబుతున్నారు. సదరు అంధుడు ఎవరికి ఓటేశాడనే విషయాన్ని బహిరంగ పరచబోనని సహాయకుడిగా వెళ్లే వ్యక్తి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అందుకే మన ఓటు మనం వేస్తే చాలు అందరికి పంచుకుందామని ఒకవేళ లోపలికి వెళ్లి సెల్పీ దిగారో జైలులో ఊసలు లెక్కపెడతారు చూసుకోండి జాగ్రత్తగా ఉండండి. ఇక 2021లో ఏపీలో మండలి ఎన్నికల్లో కొందరు ఓటర్లు ఓటు వేస్తూ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే..
Nandamuri Balakrishna: ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన బాలకృష్ణ.. ప్రభుత్వంపై ఫైర్
తాజావార్తలు
-
Harmanpreet Kaur: టీ20ల్లో దిగ్గజ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్.!
-
Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా…?
-
Hardik Pandya: “మా పతనానికి కారణం ఇదే”.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్
-
Sachin Tendulkar Birthday: గిరిజన పిల్లలతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసిన ‘క్రికెట్ గాడ్’.!
-
IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!