Vote Selfie: ఓటేస్తూ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటే.. చిక్కుల్లో పడ్డట్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vote Selfie: ఓటింగ్ అనేది అత్యంత రహస్య ప్రక్రియ. ఓటర్లు నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ.. వేసిన ఓటు ఎవరికి వేసారో అత్యంత రహస్యంగా ఉంచి ఓటరు మహాశయుని హక్కుకు భంగం కలగకుండా చూడాలి. అయితే కొందరు ఓటు వేసిన తరువాత బ్యాలెడ్ బాక్స్ దగ్గరే నిలబడి సెల్ఫీ ఫోటోలు తీస్తూ.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరొకొందరైతే.. ఓటేస్తూ సెల్ఫీలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో వైరల్ అవడానికి పోస్ట్ చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు. అలాంటిది ఇప్పుడు అలా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారో నేరుగా జైలుకే వెళ్లాల్సి వస్తుంది. యస్ మీరు విన్నది నిజమే.
ఇక మరోవైపు సోషల్ మీడియా వినియోగం పెరగడంతో సెల్ఫీలు దిగి ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇక కూర్చున్నా, నిల్చున్నా, తింటున్నా.. ఇలా చేసే పనేదైనా సెల్ఫీ దిగడం ఆనవాయితీగా మారిపోతుంది. దిగిన సెల్పీని స్నేహితులతో పంచుకోవడం ఎక్కువైంది. నిషేధిత ప్రాంతాల్లోనూ సెల్ఫీలు దిగుతున్న వారు కోకొల్లలు. అయితే.. ఈ అలవాటును ఓటేసేటప్పుడు చూపించొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ దిగడం వరకు ఓకే కానీ.. లోపలికి ఫోన్ తీసుకెళ్లినా, ఓటేస్తూ ఫొటో దిగినా చిక్కుల్లో పడతారని అధికారులు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడంపై ఎలక్షన్ కమిషన్ బ్యాన్ విధించింది. పొరపాటున లేక సిబ్బంది కళ్లుగప్పి లోపలికి ఫోన్ తీసుకెళ్లి సెల్ఫీ దిగారో ఇక మీ జీవితం జైలుపాలవుతారని హెచ్చరిస్తుంది.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
మీరు.. ఓటేస్తూ సెల్ఫీ దిగినా.. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినా మీ ఓటును పరిగణనలోకి తీసుకోరని తెలిపింది. కాగా.. నిబంధనలు అతిక్రమించినందుకు పోలీస్ కేసు నమోదు చేస్తారు. అంతేకాదండోయ్.. ఆపై జైలుకెళ్లడం, కోర్టుల చుట్టూ తిరగడం తప్పదు. ఇక మరోవైపు, కళ్లు కనిపించని వారు ఓటేసేందుకు సహాయకుడిని అనుమతిస్తామని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. కాగా.. అప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తినే సహాయకుడిగా అంగీకరిస్తామని చెబుతున్నారు. సదరు అంధుడు ఎవరికి ఓటేశాడనే విషయాన్ని బహిరంగ పరచబోనని సహాయకుడిగా వెళ్లే వ్యక్తి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అందుకే మన ఓటు మనం వేస్తే చాలు అందరికి పంచుకుందామని ఒకవేళ లోపలికి వెళ్లి సెల్పీ దిగారో జైలులో ఊసలు లెక్కపెడతారు చూసుకోండి జాగ్రత్తగా ఉండండి. ఇక 2021లో ఏపీలో మండలి ఎన్నికల్లో కొందరు ఓటర్లు ఓటు వేస్తూ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే..
Nandamuri Balakrishna: ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన బాలకృష్ణ.. ప్రభుత్వంపై ఫైర్
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!