Secunderabad: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. శివారు స్టేషన్ల నుంచే ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త అందించారు. ఇకపై సబర్బన్ స్టేషన్ల నుంచి ప్రయాణాలు కొనసాగించవచ్చని వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు రోజురోజుకు రద్దీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో లింగంపల్లి, కాచిగూడ, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ల నుంచి సుదూర ప్రాంతాలకు సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే లింగంపల్లి – విజయవాడ ఉద్యోగుల ప్రత్యేక ఇంటర్సిటీ రైలు, గౌతమి, కాకినాడ, జన్మభూమి రైళ్లు లింగంపల్లి నుంచి బయలుదేరుతున్నాయి. ఇటీవల లింగంపల్లి రైల్వే స్టేషన్కు విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఏర్పాట్లను పరిశీలించారు. హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఇక్కడ ఆగితే 50 శాతం మంది ప్రయాణికులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించారు. కాచిగూడ నుంచి విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరులకు రైళ్లను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరుగా మల్కాజిగిరి, మౌలాలి రైల్వే స్టేషన్లలో ఆగేలా చర్యలు తీసుకుంటున్నారు.
Read also: Leo: ఇంకా 50 డేస్ ఉంది కదండీ… అప్పుడే ఇలా చేస్తే ఎలా?
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
- Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రస్తుతం 6 ప్లాట్ఫారమ్లు ఉన్నాయి. యాదాద్రి వరకు మూడో లైన్ కూడా సిద్ధం కానుంది. మౌలాలి నుంచి చర్లపల్లి నుంచి ఘట్కేసర్ వరకు 4 లైన్లు ఉండగా.. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఇక్కడి నుంచి సులువుగా ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. MMTS రెండవ దశ రైళ్లు జనవరి 2024 నాటికి ఘట్కేసర్ వరకు నడుస్తాయి. MMTS చర్లపల్లికి చేరుకుని అక్కడి నుండి గమ్యస్థానాలకు వెళ్లవచ్చు. లింగంపల్లి నుంచి బయలుదేరే రైలు హైటెక్ సిటీలో ఆగుతుంది. సనత్నగర్-మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో దశలో నిర్మించిన అదనపు లైన్ ద్వారా చర్లపల్లికి చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. కాచిగూడ నుండి రైళ్లు సీతాఫల్మండి మీదుగా మల్కాజిగిరి మరియు మౌలాలి చేరుకుంటాయి. దక్షిణ మధ్య రైల్వే అధికారుల నిర్ణయంపై రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగర శివార్లలో రైళ్లలో ఎక్కి దిగడం వల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నారు.
Opposition Parties: రెండ్రోజుల సమావేశం.. ‘ఇండియా’ కూటమి లోగో విడుదల
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..