Mother Tearful: ఆకలి వేస్తున్న అన్నం పెట్టడం లేదు.. కన్నీరు పెట్టుకున్న తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Tearful: మారుతున్న కాలంతో పాటు బంధాల్లో కూడా మార్పులు వచ్చాయి. కడుపున పుట్టిన పిల్లలైనా, కన్న తల్లైనా .. బంధాలు అనుబంధాలు అన్నీ వ్యాపార బంధాలుగా మారుతున్నాయి. రోజు రోజుకీ మానవ సంబంధాలు మరింతగా దిగజారుతున్నాయి. కొందరు పుత్రరత్నాలకి చివరికి కన్నతల్లిదండ్రులు కూడా భారమైపోతున్నారు. తమ ఆర్ధిక పరిస్థితి సహకరించడంలేదంటూ.. జీవాన్ని, జీవితాన్ని ఇచ్చిన అమ్మానాన్నలను అనాథల్లా రోడ్డుమీద వదిలేసి.. చేతులు దులిపేసుకుంటున్నారు.. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి.. కన్న బిడ్డలకు భారమైపోతున్నారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కన్నబిడ్డలు తల్లిని రోడ్డున పడేసిన జ్ఞానులు ఎందరో ఉన్నారు. ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటూ వేడుకుంటున్నా ఆతల్లికి కడుపున పిడికెడు అన్నం కూడా పెట్టకుండా నడిరోడ్డుపై వదిలేని వైనం తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ ఇంట విషాదం.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ..
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాణం పోసిన తల్లి పట్ల కొడుకులు అమానుషంగా ప్రవర్తించారు. చిన్నప్పటి నుండి కళ్లల్లో పెట్టుకుని కనిపెంచిన కొడుకులు తల్లిపట్ల మానవత్వం మరిచారు. కొడుకులు బాగా ఎదగాలని తన రెక్కలు ముక్కలు చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేలా చేసిన.. కన్న తల్లికి పట్టేడు అన్నం పెట్టేందుకు వెనుకాడారు. వయసు మళ్లీ ఆ తల్లి ఆకలి కేకలతో చేతులెత్తి ప్రాధేయపడ్డా అన్నం పెట్టేందుకు ముందుకు రాలేదు. ఆతల్లికి ఏం చేయాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించింది. తనకు ఆలనాపాలనా చూడటం లేదని అంతేకాకుండా.. తన కూతుళ్లను చూసేందుకు అనుమతించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లిలో ఈఘటన చోటుచేసుకుంది. వెంకటనర్సమ్మ అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వయసు రీత్యా పిడికెడు అన్నం పెట్టకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారని వెంకటనర్సమ్మ అనే వృద్ధురాలు ముదిగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె కంటతడి పెట్టుకుని ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటూ ప్రాధేయపడ్డా తన కొడుకులు అన్నం పెట్టడం లేదని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరి హృదయాలను ఆతల్లి కన్నీపెట్టుకుని కలిచివేసింది.
Traffic Police: సిగ్నల్ క్రాస్ చేస్తున్నారా? అయితే జాగ్రత.. 24గంటలు నిఘా..
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?