Mother Tearful: ఆకలి వేస్తున్న అన్నం పెట్టడం లేదు.. కన్నీరు పెట్టుకున్న తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Tearful: మారుతున్న కాలంతో పాటు బంధాల్లో కూడా మార్పులు వచ్చాయి. కడుపున పుట్టిన పిల్లలైనా, కన్న తల్లైనా .. బంధాలు అనుబంధాలు అన్నీ వ్యాపార బంధాలుగా మారుతున్నాయి. రోజు రోజుకీ మానవ సంబంధాలు మరింతగా దిగజారుతున్నాయి. కొందరు పుత్రరత్నాలకి చివరికి కన్నతల్లిదండ్రులు కూడా భారమైపోతున్నారు. తమ ఆర్ధిక పరిస్థితి సహకరించడంలేదంటూ.. జీవాన్ని, జీవితాన్ని ఇచ్చిన అమ్మానాన్నలను అనాథల్లా రోడ్డుమీద వదిలేసి.. చేతులు దులిపేసుకుంటున్నారు.. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి.. కన్న బిడ్డలకు భారమైపోతున్నారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కన్నబిడ్డలు తల్లిని రోడ్డున పడేసిన జ్ఞానులు ఎందరో ఉన్నారు. ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటూ వేడుకుంటున్నా ఆతల్లికి కడుపున పిడికెడు అన్నం కూడా పెట్టకుండా నడిరోడ్డుపై వదిలేని వైనం తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ ఇంట విషాదం.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ..
Also Read
- CM Revanth Reddy :ఇక ప్రభుత్వ స్కూల్ పిల్లలూ కార్పొరేట్ స్టైల్లో.. కొత్త కిట్లు రెడీ.!
- MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్
- Bhatti Vikramarka : చరిత్రను, భవిష్యత్తును గుండెకు హత్తుకున్న నగరం హైదరాబాద్
- CM Revanth Reddy : వర్షాల వేళ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం హెచ్చరిక
రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాణం పోసిన తల్లి పట్ల కొడుకులు అమానుషంగా ప్రవర్తించారు. చిన్నప్పటి నుండి కళ్లల్లో పెట్టుకుని కనిపెంచిన కొడుకులు తల్లిపట్ల మానవత్వం మరిచారు. కొడుకులు బాగా ఎదగాలని తన రెక్కలు ముక్కలు చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేలా చేసిన.. కన్న తల్లికి పట్టేడు అన్నం పెట్టేందుకు వెనుకాడారు. వయసు మళ్లీ ఆ తల్లి ఆకలి కేకలతో చేతులెత్తి ప్రాధేయపడ్డా అన్నం పెట్టేందుకు ముందుకు రాలేదు. ఆతల్లికి ఏం చేయాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించింది. తనకు ఆలనాపాలనా చూడటం లేదని అంతేకాకుండా.. తన కూతుళ్లను చూసేందుకు అనుమతించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లిలో ఈఘటన చోటుచేసుకుంది. వెంకటనర్సమ్మ అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వయసు రీత్యా పిడికెడు అన్నం పెట్టకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారని వెంకటనర్సమ్మ అనే వృద్ధురాలు ముదిగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె కంటతడి పెట్టుకుని ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటూ ప్రాధేయపడ్డా తన కొడుకులు అన్నం పెట్టడం లేదని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరి హృదయాలను ఆతల్లి కన్నీపెట్టుకుని కలిచివేసింది.
Traffic Police: సిగ్నల్ క్రాస్ చేస్తున్నారా? అయితే జాగ్రత.. 24గంటలు నిఘా..
తాజావార్తలు
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
-
Drugs Party : మాదాపూర్లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీపై దాడి.. బెజవాడ కనెక్షన్ బట్టబయలు
-
CM Revanth Reddy :ఇక ప్రభుత్వ స్కూల్ పిల్లలూ కార్పొరేట్ స్టైల్లో.. కొత్త కిట్లు రెడీ.!
-
MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!