Mother Tearful: ఆకలి వేస్తున్న అన్నం పెట్టడం లేదు.. కన్నీరు పెట్టుకున్న తల్లి
Mother Tearful: మారుతున్న కాలంతో పాటు బంధాల్లో కూడా మార్పులు వచ్చాయి. కడుపున పుట్టిన పిల్లలైనా, కన్న తల్లైనా .. బంధాలు అనుబంధాలు అన్నీ వ్యాపార బంధాలుగా మారుతున్నాయి. రోజు రోజుకీ మానవ సంబంధాలు మరింతగా దిగజారుతున్నాయి. కొందరు పుత్రరత్నాలకి చివరికి కన్నతల్లిదండ్రులు కూడా భారమైపోతున్నారు. తమ ఆర్ధిక పరిస్థితి సహకరించడంలేదంటూ.. జీవాన్ని, జీవితాన్ని ఇచ్చిన అమ్మానాన్నలను అనాథల్లా రోడ్డుమీద వదిలేసి.. చేతులు దులిపేసుకుంటున్నారు.. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి.. కన్న బిడ్డలకు భారమైపోతున్నారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కన్నబిడ్డలు తల్లిని రోడ్డున పడేసిన జ్ఞానులు ఎందరో ఉన్నారు. ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటూ వేడుకుంటున్నా ఆతల్లికి కడుపున పిడికెడు అన్నం కూడా పెట్టకుండా నడిరోడ్డుపై వదిలేని వైనం తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ ఇంట విషాదం.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ..
Also Read
- Prabhas Fauj : ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం కు యాక్సిడెంట్
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
- Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాణం పోసిన తల్లి పట్ల కొడుకులు అమానుషంగా ప్రవర్తించారు. చిన్నప్పటి నుండి కళ్లల్లో పెట్టుకుని కనిపెంచిన కొడుకులు తల్లిపట్ల మానవత్వం మరిచారు. కొడుకులు బాగా ఎదగాలని తన రెక్కలు ముక్కలు చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేలా చేసిన.. కన్న తల్లికి పట్టేడు అన్నం పెట్టేందుకు వెనుకాడారు. వయసు మళ్లీ ఆ తల్లి ఆకలి కేకలతో చేతులెత్తి ప్రాధేయపడ్డా అన్నం పెట్టేందుకు ముందుకు రాలేదు. ఆతల్లికి ఏం చేయాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించింది. తనకు ఆలనాపాలనా చూడటం లేదని అంతేకాకుండా.. తన కూతుళ్లను చూసేందుకు అనుమతించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లిలో ఈఘటన చోటుచేసుకుంది. వెంకటనర్సమ్మ అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వయసు రీత్యా పిడికెడు అన్నం పెట్టకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారని వెంకటనర్సమ్మ అనే వృద్ధురాలు ముదిగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె కంటతడి పెట్టుకుని ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటూ ప్రాధేయపడ్డా తన కొడుకులు అన్నం పెట్టడం లేదని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరి హృదయాలను ఆతల్లి కన్నీపెట్టుకుని కలిచివేసింది.
Traffic Police: సిగ్నల్ క్రాస్ చేస్తున్నారా? అయితే జాగ్రత.. 24గంటలు నిఘా..
తాజావార్తలు
-
Jasprit Bumrah Poor Performance: బుమ్రా అత్యంత చెత్త రికార్డు.. కెరీర్లోనే.. ?
-
White House: లాక్డౌన్లో వైట్ హౌస్.. అమెరికా అధ్యక్షుడి నివాసం వద్ద గన్ ఫైర్.. రంగంలోకి సీక్రెట్ సర్వీస్!
-
Prabhas Fauj : ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం కు యాక్సిడెంట్
-
West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
-
TVK : టీవీకే విజయకేతనం.. విజయ్ వెనుక అసలైన ‘చాణక్యుడు’ ఇతడే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!