Rangareddy Crime: దారుణం.. 20 రూపాయల కోసం కన్నతల్లినే కిరాతకంగా చంపిన కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy Crime: ఈ భూమిపై వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. నిస్వార్థ ప్రేమ తల్లి మాత్రమే. ఆ మాతృమూర్తి.. తన పిల్లలను ఏ కష్టం లేకుండా పెంచి పెద్ద చేస్తుంది. కన్న తల్లి ప్రేమను మర్చి.. దారుణానికి ఓడిగడుతున్నారు. కొందరైతే.. డబ్బు కోసం తల్లులను హత్య చేస్తున్నారు. మరికొందరు డబ్బు కోసం కొడుకుల తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేస్తూ నరకం చూపిస్తున్నారు. ఇక.. చిన్నప్పటి నుంచి తనకు సేవ చేసిన తల్లి వృద్ధాప్యంలో సేవ చేయడం మానేసి.. దారుణంగా హత్య చేసిన ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయా అనే సందేహం కలుగుతోంది. ప్రాణాలను పణంగా పెట్టి ప్రసవించిన తల్లిపై కొందరు కొడుకులు దాడి చేస్తున్నారు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్-కేశంపేటలో జరిగింది.
Read also: Ayodhya Ram Mandir: అయోధ్యలో రామయ్య ఊరేగింపు రద్దు.. కారణం ఏంటంటే?
Also Read
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
షాద్ నగర్లో సుగుణమ్మ అనే మహిళ నివసిస్తోంది. స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు శివకుమార్ అనే కుమారుడు ఉన్నాడు. డబ్బుల కోసం తల్లిని..శివకుమార్ను తరచూ వేధించేవాడు. అదేవిధంగా ఆదివారం రాత్రి కూడా రూ.20 డబ్బుల కోసం శివకుమార్ తల్లి సుగుణమ్మతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కొడుకు విచక్షణ సహనం కోల్పోయి తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో తల్లిపై దాడికి పాల్పడ్డాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అక్కడే వున్న వారు వద్దు ఆమె నీకు తల్లి తనపై అలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని చెబుతున్నా.. శివకుమార్ చెవిన వేసుకోలేదు. కొడుకు ఆమెను దారుణంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను తన చీరతోనే మెడకు గట్టిగా బిగించాడు. ఊపిరి ఆడకుండా చేశాడు. దీంతో ఆమె సృహ కోల్పోయింది. అయితే తెల్లవారుజామున సుగుణమ్మ మృతి చెందింది. ఇది చూసిన నిందితుడు తన తల్లి అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
Sri Krishna Janmabhoomi: నేడు శ్రీ కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
తాజావార్తలు
-
Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
-
NBK 111 : బాలయ్య – గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
-
Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!