Telangana: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన సిరిసిల్ల రాజయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు చేపట్టారు. ఎర్రమంజిల్ లోని కమిషన్ కార్యాలయంలో రాజయ్య బాధ్యతలు తీసుకున్నారు. సంకేపల్లి సుధీర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, నెహ్రు నాయక్ కమిషన్ మెంబర్స్ గా చార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ స్మితా సబర్వాల్ హాజరయ్యారు. రాజయ్య మాట్లాడుతూ.. గ్రామ పంచాయితీలు ఆర్థికంగా బలోపేతం కావాలని రాజీవ్ గాంధీ ఫైనాన్స్ కమీషన్స్ ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. నిధులు లేక గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు విలవిలలాడుతున్నారని అన్నారు. గ్రామ పంచాయితీలను, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తామన్నారు. మూలన పడిన ఫైనాన్స్ కమిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ధరించారని తెలిపారు. నాపైన ఎంతో విశ్వాసం ఉంచి నాకు బాధ్యతలు ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలని తెలిపారు. రేపటి నుంచే పని ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు.
Read also: Top Headlines@1PM: టాప్ న్యూస్
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
సిరిసిల్ల రాజయ్య 15వ లోక్సభకు వరంగల్లు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజయ్య మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కడియం… 3,92,574 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. మరోవైపు సిరిసిల్ల రాజయ్య కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఆయన కోడలు ఆత్మహత్య కేసులో అరెస్టయ్యారు. ఈ ఘటన 2015లో జరిగింది.ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనపై దాడి చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొడాలి ఆత్మహత్య కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత, రాజయ్య కుటుంబం 2022 మార్చిలో నిర్దోషిగా విడుదలైంది. రాజయ్య తన ఇంటికి తిరిగి వచ్చి పార్టీలో క్రియాశీలకంగా మారారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించారు. అయితే ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్గా ఆయన నియమితులైనందున ఆయనకు పోటీగా ఉండకపోవచ్చని తెలుస్తోంది.
Revanth Reddy: హైదరాబాద్ ను చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!