Etela Rajender: నువ్వు గెలిస్తావా? నేను గెలుస్తానా? అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లో ఉందని సీఎం కేసీఆర్ కు.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ప్రజ్ఞాపూర్ లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్లో ఈ ఊరుకి వెళ్లినా మా భూములు గుంజుకున్నారు అని చెప్తున్నారని అన్నారు. ధరణి తెచ్చి మా భూములపై హక్కులు లేకుండా చేశారని బాధపడుతున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకులు బ్రోకర్లుగా మారారని తెలిపారు. సంవత్సరాలుగా సాగు చేసికుంటున్న భూములని దళితులనుండి దూరం చేసారని అన్నారు. మళ్ళీ కేసీఆర్ గెలిస్తే ఉన్న ఇళ్ళును కూడా లాక్కుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ ప్రజలను ఎవరూ కొనలేరు. డబ్బులు ఇస్తే తీసుకుంటారు. కానీ కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించడం ఖాయమన్నారు.
కేసీఆర్ ఎట్లా ఓడిపోలేదో నేను కూడా ఒక్కసారి ఓడిపోలేదన్నారు. ఇక నువ్వు గెలిస్తావా? నేను గెలుస్తానా అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లో ఉందన్నారు. కాళేశ్వరం నీళ్లు ఇక్కడ రాకముందే గోదావరిలో మునిగిపోయిందన్నారు. మన డబ్బులన్నీ గోదావరిపాలు చేశారని అన్నారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపిన తరువాత హరీష్ రావు హుజురాబాద్ వచ్చి కేసీఆర్ అక్రమ సంపాదన 600 కోట్లు ఆరు నెలల పాటు ఖర్చు పెట్టారని తెలిపారు. నా మొఖం అసెంబ్లీలో కనపడవద్దు అని తిరిగారు. కాని మా ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని మండిపడ్డారు. దళితబంధు, బీసీబంధు అన్నీ అబద్ధపు మాటలు. దళితబంధు కేవలం నన్ను ఓడగొట్టడానికి పెట్టారని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం కష్టపడి చదువుతుంటే.. పైరవీ చేసుకున్న వారికి మాత్రమే ఉద్యోగాలని 17 పేపర్లు లీక్ చేశాడు కేసీఆర్ అని మండిపడ్డారు.
Nandini Rai Saree Pics: తెలుపు చీరలో పిచ్చెక్కిస్తున్న నందిని రాయ్.. హాట్ పిక్స్ అదిరాయిగా!