Site icon NTV Telugu

అభయ హస్తం పథకాన్ని తిరిగి ప్రారంభించాలి..వైఎస్‌ షర్మిల డిమాండ్‌

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన అభయహస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్‌లో..పొదుపు సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఉండాలని YS రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆలోచనల ఫలితమే అభయహస్తం పథకం.2017 వరకు అమలైన పథకంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్..

Read Also: ఉమ్మడి కరీంనగర్‌లో భారీగా పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ విలువ

ఐదేండ్లయితున్న ఇప్పటివరకు అమలు చేసింది లేదు. అభయహస్తం పథకం కింద డబ్బులు కట్టిన మహిళలకు తిరిగి ఇచ్చింది లేదు.ఇంటికో పెన్షనంటూ మెలికలు పెట్టి, పథకాన్ని అటకెక్కించి, వృద్ధ్యాప్య మహిళలకు ఆర్థిక భరోసా లేకుండా చేశారు.ఆసరా పెన్షన్స్ తో సంబంధం లేకుండా అభయహస్తం పథకాన్ని తిరిగి కొనసాగించాలని లేదంటే మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అంటూ షర్మిల ట్విట్టర్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Exit mobile version