Shabbir Ali : రైతుల కోసమే మా ఈ పోరు.. రాజకీయం కోసం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Senior Leader Shabbir Ali Tour At Kamareddy District.
తెలంగాణలో రైతులకు న్యాయం చేయాలంటూ టీ కాంగ్రెస్ ‘మన ఊరు.. మన పోరు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో మన ఊరు మన పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతు సమస్యలపై ఈ మా పోరు. రాజకీయాల కోసం కాదు రైతుల సమస్య కొరకై ఈ కార్యక్రమమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతుల ధాన్యం కొనుగోలు చేయమని కేసీఆర్ వరి వేస్తే ఉరి అంటారని ఆయన విమర్శించారు. ప్రజలు రైతులు కలిసి కేసీఆర్కు, ప్రభుత్వం లోని మంత్రులకు ఉరి వేయాలని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఒకప్పుడు ఎక్కువ సమయం కేటాయించేవారు ఈ సంవత్సరం 11 రోజుల్లో ఖతం చేశారన్నారు. పోచారం స్పీకర్ అయినంక అసెంబ్లీలో డెబిట్ ఎక్కువ పెడుతాడు. రైతు బిడ్డ అనుకున్నాం. అందరికీ సమయం ఇస్తారు అనుకున్నాం అలా జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
- Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
కానీ కేసిఆర్ కనుసన్నల్లో అసెంబ్లీ నడుస్తోంది.. సమస్యలపై నోరెత్తితే మా సభ్యుల మైక్ కట్ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్నింటికీ ఒకే ట్యాక్స్ ఉంటే బాన్సువాడ లో పోచారం కుటుంబం రెండు ట్యాక్స్ లు వసూలు చేస్తారని, పేదవాడు ఇళ్ళు కట్టుకుంటే ఇసుకకు ట్యాక్స్ లు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎల్లారెడ్డిలో 20న నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు, ప్రజలు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నే మా ఊరు మా పోరు కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ ప్రెస్ మీట్ లో జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షట్టర్, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు గడుగు గంగాధర్లు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..