NTV Telugu Site icon

Nallu Indrasena Reddy: ఎవరు పనితీరు ఏంటో మోడీకి తెలుసు.. రేవంత్ పై ఇంద్రసేనా రెడ్డి ఫైర్..

Nallu Indrasena Reddy Revanth Reddy

Nallu Indrasena Reddy Revanth Reddy

Nallu Indrasena Reddy: రేవంత్‌రెడ్డిపై త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన నల్లు ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు పనితీరు ఏంటో మోడీకి తెలుసరి ఇంద్రసేనారెడ్డి ఫైర్ అయ్యారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డినైన తనకు గవర్నర్ పదవి వచ్చిందనందుకు రేవంత్ రెడ్డి బాధ పడిపోతున్నారని మండిపడ్డారు. ఎంతసేపూ ఇతరులను ఇరకాటంలో పెట్టడమే రేవంత్ రెడ్డి పని అంటూ వ్యాఖ్యలు చేశారు. సొసైటీని డివైడ్ చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ ఓపెన్‌గా అనేకసార్లు చెప్పారన్నారని స్పష్టం చేశారు. మోడీ స్వయంగా ఫోన్ చేసి త్రిపుర గవర్నర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారని.. తన సిన్సియారిటీ గురించి ఏపీ, తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ఎవరు పనితీరు ఏంటో మోడీకి తెలుసన్నారు. ఎప్పుడు ఎవరకి ఏ బాధ్యతలు ఇవ్వాలో వారికి తెలుసని చెప్పుకొచ్చారు. గతంతో పోల్చితే మోడీ హాయాంలో ఈశాన్య రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయని నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు.

త్రిపుర గవర్నర్‌గా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఆయనను గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం (అక్టోబర్ 18) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్‌గా నియమితులైన తర్వాత ఇంద్రసేనారెడ్డి తొలిసారి స్పందించారు. బీజేపీలో ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. గవర్నర్‌గా నియమితులైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. మలక్ పేట నియోజకవర్గ ప్రజలకు ఈ గుర్తింపు వస్తుందన్నారు. ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
Kishan Reddy: రామప్ప అభివృద్ధి చేసింది మేమే.. రాహుల్, ప్రియాంక మోడీకి థ్యాంక్స్ చెప్పాలి..