Avinash Mohanty IPS: మియాపూర్, చందనగర్ పరిధిలో 144 సెక్షన్
- మియాపూర్- చందనగర్ పరిధిలో 144 సెక్షన్ -సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంటీ..
- ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి వచ్చిన వారిని ఖాళీ చేయించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avinash Mohanty IPS: మియాపూర్, చందనగర్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉందని సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంటీ అన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి వచ్చిన వారిని ఖాళీ చేయించామన్నారు. నిన్న పోలీసులపై కొంత మంది రాళ్లు విసిరారని తెలిపారు. లా అండ్ ఆర్డర్ తప్పేలా ….వ్యవహరించారని మండిపడ్డారు. వారిపై కేస్ లు నమోదు చేసామన్నారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవచ్చు అని ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. దీనికి వెనుక ఉన్న వారిపై కేస్ లు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ భూమి కాబట్టి నేటి నుండి ప్రత్యేక భద్రత ను ఏర్పాటు చేసామన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించు కోవచ్చు అని వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు. దాదాపు వెయ్యి మంది ఫోర్స్ ని ల్యాండ్ దగ్గర పెట్టామన్నారు. ఈ పరిసరాల్లో అనుమానస్పదం గా తిరిగితే అరెస్ట్ లు ఉంటాయని తెలిపారు. దీంతో మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101 వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Read also: Kaushik Reddy: మేము అధికారంలోకి వస్తాం.. అప్పుడు మీకు బ్లాక్ డెస్..
Also Read
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
వెయ్యి మంది పోలీసులతో భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. భూమి చుట్టూ ఉన్న రోడ్ల వద్ద బారికెట్లు వేసి లోపలికి ఎవరిని అనుమతించమని క్లారిటీ ఇచ్చారు. 450 ఎకరాలు ప్రభుత్వ భూమి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉందని ఎస్టేట్ ఆఫీసర్ పేర్కొన్నారు. కావాలని కొంతమంది వదంతులు సృష్టించి గుడిసెలు వేసుకోవచ్చని వాట్సప్ లలో పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆక్రమించడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ల్యాండ్ మొత్తం గుట్టలతో అడవి లాగ ఉండడంతో ఇంకా కొంతమంది చెట్ల కింద బండరాయలు కింద ఉన్నవారిని గుర్తించి బయటకు పోలీసులు పంపించారన్నారు. డ్రోన్ కెమెరాలు సహాయంతో రెండు సర్వే నెంబర్లలో ఉన్న భూమిలో జల్లెడ పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే భూ ఆక్రమణ కేస్ లో 20మంది పై కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. సంఘటనా స్థలానికి సీపీ అవినాష్ మొహంటీ చేరుకుని ఎటువంటి ఆటంకాలు జరగకుండా పరిశీలిస్తున్నారు.
Legal Notices: మంత్రి పొన్నంపై ఆరోపణలు.. పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు..
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే ధన నష్టం తప్పదు.. వాస్తు ఏం చెబుతోంది..?
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!