NTV Telugu Site icon

K. A. Paul: నా చారిటీని కొంతమంది కుట్రతో రద్దు చేయించారు

K.a.paul

K.a.paul

K. A. Paul: నా చారిటీని కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతో రద్దు చేయించారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ ని KA పాల్ కలిసారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు లో కేసు వేస్తా అన్నారు. రేవంత్ రెడ్డి విదేశాల నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను సీఎం రేవంత్ రెడ్డి కలిసి నెలకోసారి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెద్దామని చెప్పానని అన్నారు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్లు నాతో మాటాడొద్దు అని చెబుతున్నారని అన్నారు.

Read also: South Central Railway: మూడు రోజుల పాటు స్పెషల్ రైళ్లు రద్దు..

రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బెస్ట్ సీఎం లేకపోతే వరెస్ట్ సీఎం అన్నారు. అక్టోబర్ 2న సమ్మిట్ పెట్టాలి లేకపోతే ఏదో ఓ బటన్ నొక్కి అందరి సంగతి తెలుస్తా అన్నారు. సదాశివపేటలో 1200 ఎకరాల్లో సొంతంగా చారిటీ పెట్టి.. 53 వేల మందికి ఉచితంగా అన్నం పెట్టానని అన్నారు. నా చారిటీని కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతో రద్దు చేయించారన్నారు. ఇప్పుడు చారిటీలో 50 ఎకరాల భూములను గుంజుకోవడానికి నా మనుషులపై దాడులు చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డితో పాటు ఏడుగురిని పైకి పంపినట్టే నా భూమిని కబ్జా చేస్తున్న వారిని పైకి పంపుతా అన్నారు. నీ చుట్టూ ఉన్నవాళ్లు రాష్టం అభివృద్ధి కాకుండా కుట్ర చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుని సేవను ఆపడానికి కుట్ర చేసినోడు ఎవ్వడు కూడా మిగలడని తెలిపారు.
Hyderabad Metro: నిలబడేందుకు చోటులేదు.. మెట్రోలో కోచ్ లు పెంచండి..