Sangareddy: జీతాలు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటాం..300 కార్మికుల ఆందోళన
- సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం వివిన్ పరిశ్రమలో కార్మికుల ఆందోళన..
- గత ఎనిమిది నెలలుగా యాజమాన్యం జీతాలు ఇవ్వడం లేదని నిరసన..
- బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తామంటూ ఆందోళన చేస్తున్న కార్మికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని వివిన్ పరిశ్రమలో 300 మంది కార్మికుల ఆందోళన చేపట్టారు. గత కొన్ని నెలలుగా యాజమాన్యం జీతాలు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తామంటూ కార్మికులు ఆందోళన చేస్తు్న్నారు. ఎనిమిది నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో పని చేస్తున్న 300 మంది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు వెంటనే ఇవ్వకపోతే పై నుంచి ఆత్మహత్య చేసుకుంటామని కార్మికుల బెదిరిస్తున్నారు. ఎనిమిది నెలల నుంచి అప్పుడు ఇప్పుడు అంటూ నెలలు గడుస్తున్నా పట్టించుకోవాడం లేదంటూ మండిపడుతున్నారు. తినే తిండిలేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు.
Read also: Leopard in Srisailam: శ్రీశైలంలో చిరుత కలకలం.. భక్తులకు అధికారుల హెచ్చరిక
Also Read
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
ఎనిమిది నెలలుగా అప్పులు కుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్య పుస్తలను అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నామని కార్మికులు తెలిపారు. ఎనిమిది నెలలుగా జీతం ఇస్తామంటూ కాలం వృధా చేశారని మండిపడ్డారు. యాజమాన్యం కార్మికుల బాధలు అర్థం చేసుకుంటుందనే ఇంత కాలం ఎదురు చూశామని .. కానీ ఇప్పుడు 300 కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. వివిన్ పరిశ్రమక యాజమన్యం ఇప్పికి జీతాలు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చిరిస్తున్నారు. దీనిపై అధికారులు పట్టించుకోవాలని వాపోతున్నారు. పోలీసులు దీనిపై ఆరా తీసి తమకు న్యాయం చేయవాలని కోరుతన్నారు. మరి దీనిపై అధికారులు, పోలీసులు కార్మికులకు అండగా నిలిచి జీతాలు ఇప్పిస్తారా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే మరోవైపు కార్మికుల నిరసనపై వివిన్ పరిశ్రయ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం..
AP-Telangana: రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..
తాజావార్తలు
-
Balkampet Yellamma: నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?