Sangareddy MRO Rajaiah: మరోసారి బయటపడ్డ ఎమ్మార్వో బాగోతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Raikode MRO Rajaiah Again Changed Land Details Of Mohan: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మాజీ ఎమ్మార్వో రాజయ్య గుర్తున్నాడా? గత నెల సెప్టెంబర్ 20న.. ధరణి పోర్టల్లో బతికున్న మహిళను చనిపోయినట్టు చిత్రీకరించి, ఆమె 27 ఎకరాల భూమిని మరొకరి పేరుపై ఆయన పట్టా రాశాడు. డబ్బుకి కక్కుర్తికి అలవాటు పడిన ఆయన.. ఆ మహిళ భూమిని కూడా దోచేయాలని చూశాడు. కానీ.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇప్పుడు ఆయనకు సంబంధించి మరో బాగోతం బట్టబయలైంది. ఈసారి ఆయన బతికున్న యువకుడ్ని చనిపోయినట్టుగా చూపించి.. అతని భూమిని మరొకరిపై పట్టా చేసినట్టు వెలుగులోకి వచ్చింది.
ఆ యువకుడి పేరు మోహన్. రాయికోడ్ (మం) నాగ్వార్ గ్రామంలో సర్వే నెంబర్ ‘79/అ1’లో అతనికి 4.35 ఎకరాల భూమి ఉంది. కానీ.. ఈ సంవత్సరం జులైలోనే మోహన్ చనిపోయాడని ధరణి పోర్టల్లో ఆ మాజీ ఎమ్మార్వో మార్పులు చేసి.. సంగన్న అనే మరో వ్యక్తి మీద పట్టా చేశాడు. కులం వేరేది అయినప్పటికీ.. ఒకే కులంగా రాజయ్య చిత్రీకరించాడు. ఇన్నిరోజుల వరకు ఈ విషయం మోహన్కి తెలీదు. అయితే.. ఆర్థిక అవసరాల నిమిత్తం మోహన్ తన భూమిని అమ్ముదామని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ధరణి వెబ్సైట్లో తన పేరు మీదున్న భూమి వివరాల్ని సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ, ఎక్కడా వివరాలు దొరక్కపోగా.. తాను చనిపోయినట్టు అందులో మెన్షన్ చేసి ఉండటం చూసి షాక్కి గురయ్యాడు. దాంతో.. ఎమ్మార్వో ఆఫీస్కి వెళ్లి, లబోదిబోమంటూ బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read
అంతకుముందు మహిళ కేసు గురించి మాట్లాడుకుంటే.. కరోనా కారణంగా భర్త హనుమంత రెడ్డి చనిపోవడంతో, ఈ ఏడాది ఏప్రిల్లో భర్త మీదున్న 27 ఎకరాల భూమిని భార్య శివమ్మ తన పేరుపై మార్చుకుంది. అయితే.. సెప్టెంబర్ 19న మాజీ ఎమ్మార్వో రాజయ్య ధరణి పోర్టల్లో ఆమెని మృతి చెందినట్టుగా చిత్రీకరించి, మరొకరి పేరుపై వివరాలను మార్చేశాడు. శివమ్మ పోర్టల్ ఓపెన్ చేయగా.. రాజయ్య బాగోతం బయటపడింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రాజయ్యపై చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: ప్రభుత్వ హామీతో.. నిరాహార దీక్షను విరమించిన సోనం వాంగ్చుక్
-
Astrology: జూలై 24 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?