Sangareddy MRO Rajaiah: మరోసారి బయటపడ్డ ఎమ్మార్వో బాగోతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Raikode MRO Rajaiah Again Changed Land Details Of Mohan: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మాజీ ఎమ్మార్వో రాజయ్య గుర్తున్నాడా? గత నెల సెప్టెంబర్ 20న.. ధరణి పోర్టల్లో బతికున్న మహిళను చనిపోయినట్టు చిత్రీకరించి, ఆమె 27 ఎకరాల భూమిని మరొకరి పేరుపై ఆయన పట్టా రాశాడు. డబ్బుకి కక్కుర్తికి అలవాటు పడిన ఆయన.. ఆ మహిళ భూమిని కూడా దోచేయాలని చూశాడు. కానీ.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇప్పుడు ఆయనకు సంబంధించి మరో బాగోతం బట్టబయలైంది. ఈసారి ఆయన బతికున్న యువకుడ్ని చనిపోయినట్టుగా చూపించి.. అతని భూమిని మరొకరిపై పట్టా చేసినట్టు వెలుగులోకి వచ్చింది.
ఆ యువకుడి పేరు మోహన్. రాయికోడ్ (మం) నాగ్వార్ గ్రామంలో సర్వే నెంబర్ ‘79/అ1’లో అతనికి 4.35 ఎకరాల భూమి ఉంది. కానీ.. ఈ సంవత్సరం జులైలోనే మోహన్ చనిపోయాడని ధరణి పోర్టల్లో ఆ మాజీ ఎమ్మార్వో మార్పులు చేసి.. సంగన్న అనే మరో వ్యక్తి మీద పట్టా చేశాడు. కులం వేరేది అయినప్పటికీ.. ఒకే కులంగా రాజయ్య చిత్రీకరించాడు. ఇన్నిరోజుల వరకు ఈ విషయం మోహన్కి తెలీదు. అయితే.. ఆర్థిక అవసరాల నిమిత్తం మోహన్ తన భూమిని అమ్ముదామని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ధరణి వెబ్సైట్లో తన పేరు మీదున్న భూమి వివరాల్ని సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ, ఎక్కడా వివరాలు దొరక్కపోగా.. తాను చనిపోయినట్టు అందులో మెన్షన్ చేసి ఉండటం చూసి షాక్కి గురయ్యాడు. దాంతో.. ఎమ్మార్వో ఆఫీస్కి వెళ్లి, లబోదిబోమంటూ బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
అంతకుముందు మహిళ కేసు గురించి మాట్లాడుకుంటే.. కరోనా కారణంగా భర్త హనుమంత రెడ్డి చనిపోవడంతో, ఈ ఏడాది ఏప్రిల్లో భర్త మీదున్న 27 ఎకరాల భూమిని భార్య శివమ్మ తన పేరుపై మార్చుకుంది. అయితే.. సెప్టెంబర్ 19న మాజీ ఎమ్మార్వో రాజయ్య ధరణి పోర్టల్లో ఆమెని మృతి చెందినట్టుగా చిత్రీకరించి, మరొకరి పేరుపై వివరాలను మార్చేశాడు. శివమ్మ పోర్టల్ ఓపెన్ చేయగా.. రాజయ్య బాగోతం బయటపడింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రాజయ్యపై చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!