Revanth Reddy: బీజేపీ.. జనసేనతో పాటూ కేఏపాల్ ను కూడా కలుపుకుంటే బాగుండు..
Revanth Reddy: బీజేపీ.. జనసేనతో పాటూ కేఏపాల్ ను కూడా కలుపుకుంటే బాగుండని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లోని ఎఐసిసి కార్యాలయం లో టి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ల మాట్లాడారు. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న ఎన్నికల కమిషన్ ను కలిశామన్నారు. నోటిఫికేషన్ లోపల నగదు బదిలీలు పూర్తి చెయ్యాలని కోరామన్నారు. రిటైర్డ్ అధికారులను.. కొనసాగిస్తూ అధికార దుర్వినియోగాన్ని కి ప్లాపడుతున్నారు వెంటనే తొలగించాలని అన్నారు. ప్రయివేట్ అర్మిలా కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. నిజాం దగ్గర రజాకార్ల లాగా.. కేసీఆర్ వద్ద ఈ అధికారులు రజాకార్ల లా పనిచేస్తున్నారని అన్నారు. అధికారులు బీఆర్ఎస్ ఎన్నికల నిర్వహణ చేస్తున్నారని మండిపడ్డారు. అంజనీ కుమార్, స్టీఫెన్ రవీంద్ర లను బదిలీ చెయ్యాలని కోరామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్, జయేష్ రంజన్ లు బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు, దళిత బంధు, బిసి బంధు, కళ్యాణ లక్ష్మి, శాది ముభారక్ నిధులు నవంబర్ 2 లోపు విడుదల చెయ్యాలని కోరారు. లబ్ధిదారులకు ఏ నిధులు పెండింగ్ లో పెట్టినా.. మా ప్రభుత్వం వచ్చాక మా హామీ మేరకు డబుల్ నిధులు వస్తాయన్నారు.
కేసీఆర్ ఏం చెప్పినా అమలు చెయ్యరన్నారు. కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎందుకు భూమిలోకి కుంగింది? అని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్ట్ వద్ద బొగ్గు నిక్షేపాలు ఉంటాయన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ నాణ్యత లోపం అన్నారు. సాయిల్ టెస్ట్ వంటి జాగ్రత్తలు పడలేదున్నారు. గాల్లో మేడలా మెడిగడ్డ ప్రాజెక్ట్ ను నిర్మించారని ఆరోపించారు. మావోయిస్టుల మీద, సంఘ విద్రోహ శక్తులు చేశారని ప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ జైలు కు వెళ్ళే పరిస్థితి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్యాం సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నివేదిక బయట పెట్టాలన్నారు. బీఆర్ఎస్ ను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని Enc మురళిధర రావు ఎప్పుడో రిటైర్ అయ్యారని గుర్తు చేశారు. ఆయన ఇపుడు కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఇసుక కొట్టుకు పోతే డ్యాం కుంగింధి అంటే, ఎంత నాణ్యత లోపం ఉందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. కేసీఆర్ అక్రమ సంపాదనలో కేంద్రానికి కప్పం కడుతున్నారని అన్నారు. అందుకే కేంద్రం కేసీఆర్ ను కాపాడుతోందన్నారు. ఎన్నికల అధికారులకు పిర్యాదు చేయడం ప్రాసెస్ అన్నారు.
Also Read
అధికారులు తీసుకునే చర్యలను బట్టి మా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. కేసీఆర్, హరీష్, కెటిఆర్ లు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పరని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉంది . అందుకే అక్కడ ఎటువంటి దాడులు ఉండవన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాలకు ఈడి, సిబిఐ లు ముందు వెళ్తాయన్నారు. కాంగ్రెస్ ను వీడిన నాయకులు బీజేపీ సిద్దాంతాలు నమ్మి పోలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటుంది అని నమ్మారన్నారు. అది అక్కడ సాధ్యం కాదని నమ్మి వెనక్కి వస్తున్నారని తెలిపారు. రాజ్ గోపాల్ రెడ్డి, డి.కె అరుణ, విజయశాంతి, విశ్వేశ్వర్ రెడ్డిలు సిద్దాంతాలు నమ్మి బిజెపిలో చేరలేదని స్పష్టం చేశారు. బీజేపీ.. జనసేనతో పాటూ కే.ఏ.పాల్ ను కూడా కలుపుకుంటే బాగుండని వ్యంగాస్త్రం వేశారు. కొడంగల్ లో పోటీ చేద్దామని కేసీఅర్ ను కొర్తున్నానని అన్నారు. పార్టీ ఆదేశిస్తే రేవంత్, భట్టి ఎక్కడయినా పోటీ చేస్తాం, కేసీఆర్, కెటిఆర్ లను చిత్తు చిత్తుగా ఒడిస్తామన్నారు.
BS Yeddyurappa Security: మాజీ సీఎంకు Z+ సెక్యురిటీ.. భద్రతను పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటే?
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!