Revanth Reddy: విచారణ చేయకముందే ఇద్దరు మాత్రమే బాద్యులని కేటీఆర్ ఎలా చెపుతారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: కస్టడీ లోకి తీసుకోక ముందు , విచారణ చేయక ముందే ఇద్దరు మాత్రమే బాద్యులు అని కేటీఆర్ ఎలా చెపుతారు? అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో వున్న రేవంత్ రెడ్డి పేపర్ల లీకులపై ధ్వజమెత్తారు. సర్వీస్ కమిషన్ పేపర్లు అన్ని ముందే వాళ్లకు చేరాయని తెలిపారు. 2015 నుండి ప్రశ్న పత్రాల లీక్ కొనసాగుతుందని అన్నారు. కేటీఆర్ ఇద్దరు వ్యక్తులను మాత్రమే సంబంధం అంటున్నారని, ఇది వ్యవస్థకు సంబంధం లేదు అంటున్నారు, కేటీఆర్ అరెస్ట్ చేయడమే కాదు జైలులో పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళను ఎక్కడెక్కడ పెట్టారో చెప్పాలన్నారు. కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. నిందితుల దగ్గరికి ప్రభుత్వం తరుపున వెళ్లిన మధ్య వర్తులు ఎవరు? ఇది బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జైలును సందర్శించిన విజిటర్ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సిసి ఫుటేజీ స్పష్టంగా కావాలని తెలిపారు.
Read also: Vemula Prashanth Reddy: రేవంత్ రెడ్డివి దొంగ మాటలు.. తనతో ఉన్నవాళ్లు కూడా దొంగలు
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
కస్టడీ లోకి తీసుకోక ముందు, విచారణ చేయక ముందే ఇద్దరు మాత్రమే బాద్యులు అని కేటీఆర్ ఎలా చెపుతారు? అంటూ మండిపడ్డారు. సంస్ధలో పనిచేసే వాళ్లు ఎగ్జామ్ రాయడానికి వీలు లేదని, కానీ ప్రవీణ్ తో పాటు 20 మంది కి ఎలా ఎన్ ఓసి ఇస్తారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతర శాఖలకు వెళ్లాలి అక్కడే ఉద్యోగం చేయరాదన్నారు. మాధురి స్టేట్ ఫస్ట్, రజిని కాంత్ 4 ర్యాంక్, TSPSC లో పని చేస్తున్నారు. ఒకే సెంటర్ లో 25 మందికి టాప్ ర్యాంక్స్ వచ్చాయన్నారు. కేటీఆర్ పీఏ తిరుపతి.. కేటీఆర్ షాడో మంత్రి అన్నారు. వీళ్లిద్దరి ఓకే మండలమని, రాజశేఖర్ రెడ్డి కి తిరుపతి ఉద్యోగం ఇప్పించారని ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి TSPSC కి పంపారని అన్నారు. ఈ కథ నడిపించింది తిరుపతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్యాల మండలంలో 100 మందికి క్వాలిఫై అయ్యారని రేవంత్ తెలిపారు.
Naveen father: పేపర్ లీకేజ్ తో నవీన్ కి సంబంధం లేదు.. దయచేసి శవరాజకీయాలు చేయకండి
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!