Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో హైఅలర్ట్.. ఈ నెల 20 వరకు ఆంక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఆగస్టు 15 సందర్భంగా ఈనెల 20వరకు శంషాబాద్ లో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు, సందర్శకులకు కీలక సూచనలు జారీ చేశారు. ఆగస్ట్ 20 వరకు విమానాశ్రయంలోకి సందర్శకులను అనుమతించబోమని ప్రకటించారు.ఆగస్టు 16 వరకు అన్ని రకాల పాస్ లను రద్దు చేస్తున్నామని తెలిపారు.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన రహదారిపై సీఐఎస్ ఎఫ్, రక్ష, పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో ఎయిర్పోర్టులో పార్కింగ్, బయలు దేరి, రాకపోకలను తనిఖీ చేస్తున్నారు. అయితే విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు ఒకరిద్దరు మాత్రమే రావాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
Read also: Astrology: ఆగస్టు 10, గురువారం దినఫలాలు
Also Read
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
రోజుకు సుమారు 5 వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు ఈ నెలలోనే వెళ్తున్నారని వెల్లడించారు. వారిని పంపించేందుకు చాలా మంది వస్తుండటంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒక్కో విద్యార్థిని పంపించేందుకు 30 నుంచి 50 మంది వస్తున్నారని తెలిపారు. పది రోజులుగా రోజుకు లక్ష మంది విమానాశ్రయానికి వస్తున్నారని నారాయణరెడ్డి తెలిపారు. విమానాశ్రయానికి వచ్చే వారంతా వ్యక్తిగత వాహనాల్లో వస్తున్నారని, దీంతో ట్రాఫిక్, పార్కింగ్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. విమానాశ్రయానికి రోజుకు 70 వేలకు పైగా కార్లు వస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఎయిర్పోర్టులో అప్రమత్తంగా ఉండనున్నట్లు ప్రకటించారు. విమానాశ్రయంలో ఆంక్షలు ఉంటాయని, సెండ్ ఆఫ్ కోసం వచ్చే తల్లిదండ్రులు రావద్దని సూచించారు.
Lottery: జాక్ పాట్.. లాటరీలో రూ.13వేల కోట్లు గెలుచుకున్నాడు..
తాజావార్తలు
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
-
Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!