వివిధ లావాదేవీలపై బ్యాంకులకు వచ్చే కస్టమర్లతో ఎలా మర్యాద పూర్వకంగా నడుచుకోవాలనే హైదరాబాద్లో దానిపై రిజర్వు బ్యాంక్ అధికారులకు శిక్షణ శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా శిబిరం 3 వారాల పాటు సాగనుంది. అయితే.. న్యాయ విశ్వ విద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ఆర్బీఐ ఉద్యోగుల ముఖ్య విధి అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రధానంగా వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి సూచించారు.
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, డిజిటలైజేషన్, కొవిడ్ పరిణామాలతో బ్యాంకింగ్ రంగం ఎలా ప్రభావితం అయ్యిందనే విషయాలపై ఈ సమావేశంలో చర్చించినున్నట్లు ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. క్రిప్టో, బిట్ కాయిన్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, పాలసీలు, బ్యాంకింగ్ నియమ నిబంధనలు, ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్బీఐ విసృత అధికారాలు, పరిమితులు అనే అంశాలపై వచ్చే నెల 3 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి.
