NTV Telugu Site icon

Bandi Sanajay: డీలర్ల సమ్మెతో ఇబ్బంది.. రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు నిలిచిన రేషన్

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanajay: రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని, పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ డీలర్ల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి వాళ్ల సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గు చేటు. రేషన్ డీలర్లను పిలిచి మాట్లాడే తీరిక ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరమన్నారు. మే 22న సమ్మె నోటీస్ ఇచ్చిన తరువాత వాళ్ల సమస్యలన్నీ పరిష్కారిస్తామని, ఈ మేరకు జూన్ ఫస్ట్ న జీవోలను విడుదల చేస్తామని హామీ ఇచ్చినా.. నేటికీ ఒక్క జీవో కూడా విడుదల చేయకపోవడం సిగ్గు చేటని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడంవల్లే రేషన్ డీలర్లు సమ్మె చేయాల్సి వచ్చంది. రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: Ukraine-Russia: ఉక్రెయిన్ లో భారీ డ్యామ్ కూల్చివేత.. రష్యానే చేసిందని ఆరోపణ..

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నా వాటిని పేదలకు అందించకుండా కేసీఆర్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ఆరోపించారు. రేషన్ డీలర్లు కోవిడ్ టైంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేశారని గుర్తు చేశారు. ఏ ఒక్కరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో నరేంద్రమోద ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం కేటాయిస్తే తెలంగాణలో పేదలందరికీ రేషన్ డీలర్లు బియ్యం అందిస్తూ సేవలందించారని అన్నారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ లో సగం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తోందని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్రం ఠంచన్ గా కమీషన్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోందని తెలిపారు. అయినా ఆ సొమ్మును డీలర్లకు ఇవ్వకుండా సొంత అవసరాలకు వాడుకుంటూ డీలర్లకు సకాలంలో చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. వడ్ల కొనుగోలు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అలసత్వం వహిస్తూ రైతులతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలుకయ్యే సొమ్మునంతా కేంద్రమే చెల్లిస్తోందని తెలిపారు. వడ్లను సేకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమీషన్ కూడా ఇస్తోందని తెలిపారు. అయినా నేటికీ రైతుల నుండి వడ్లను కొనుగోలు చేయకుండా కళ్లెల వద్ద పడిగాపులు కాసేలా చేస్తూ వాళ్ల ఉసురు తీస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రేషన్ డీలర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంతాలు పట్టింపులకు పోయి సమ్మెను పరిష్కరించకుండా పేదల నోటికాడ మద్దను లాక్కోవాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Elon Musk: 200 రోజుల్లో 200 బిలియన్ డాలర్ల సంపద.. మస్కా మజాకా