Ration Card: రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఈ కేవైసీ అప్డేట్ చేయకుంటే సరుకులు అందవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ration Card: రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులకే బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే రేషన్కార్డుల వెరిఫికేషన్ను ప్రారంభించారు. కుటుంబ యజమానితో పాటు కార్డులో పేరు ఉన్న ప్రతి లబ్ధిదారుడు తమ ప్రాంతంలోని ప్రభుత్వ రేషన్ దుకాణానికి వెళ్లి ‘ఈ పాస్ యంత్ర’ ద్వారా వారి KYCని నవీకరించాలి. రేషన్ షాపుల్లో మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అన్ని జిల్లాల పౌరసరఫరాల అధికారులు, తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. కేవైసీ అప్డేషన్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రేషన్ డీలర్లను ఆదేశించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత రేషన్ కార్డుల పునరుద్ధరణ ప్రక్రియపై ప్రభుత్వం ఏనాడూ దృష్టి సారించలేదు. రేషన్ కార్డులున్న వినియోగదారులలో కుటుంబ యజమానులు మరణించడం, కుటుంబంలోని ఆడ పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయడం, మగ పిల్లలు పెద్దయ్యాక పెళ్లై కుటుంబాలు విడిపోవడం చాలా జిల్లాల్లో జరుగుతోంది. దీని ప్రకారం కుటుంబ సభ్యులు (యూనిట్లు) కొందరు గైర్హాజరైనా యూనిట్ కు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. రేషన్ సరుకుల దుర్వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకే రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం తమ కేవైసీని అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వినియోగదారులు వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేకుంటే వినియోగదారులకు రేషన్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త రేషన్కార్డుల జారీ, కార్డుకు కొత్త పేర్లను చేర్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
KYCని ఎలా అప్డేట్ చేయాలి
రేషన్కార్డు ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ‘ఈ పాస్’ మిషన్లో మళ్లీ వేలిముద్రలు వేయాలి. వేలిముద్ర తీసిన తర్వాత అతని ఆధార్ కార్డు నంబర్తో పాటు రేషన్ కార్డు నంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత గ్రీన్ లైట్ వచ్చి KYC అప్ డేట్ పూర్తవుతుంది. రెడ్ లైట్ ఆన్లో ఉంటే, వినియోగదారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు సరిపోలడం లేదని తిరస్కరణ సూచిస్తుంది. దీని ప్రకారం రేషన్ కార్డు నుండి ఒక యూనిట్ తొలగించబడుతుంది. రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉన్నాయో, వారంతా ఒకే సమయంలో కేవైసీ కోసం రేషన్ దుకాణానికి వెళ్లాలి. ఉదాహరణకు, ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు (యూనిట్లు) ఉంటే, అందరూ ఒకే సమయంలో KYCకి వెళ్లాలి. వారిలో ఒకరు లేదా ఇద్దరు వెళ్లకపోతే, వారు కుటుంబం నుండి విడిపోయినట్లు గుర్తించి అందుబాటులో ఉన్న వ్యక్తుల కేవైసీని తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియలో లేని రెండు యూనిట్ల వివరాలు ఈ పాస్ మెషీన్లో నమోదు చేయబడతాయి. అందువలన రెండు యూనిట్లు తొలగించబడతాయి. అప్పుడు వారికి రేషన్ అందదు. కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ షాపులకు వెళ్లి తమ కేవైసీని అప్డేట్ చేసుకోవాలి.
G20 Summit: బ్రెజిల్ అధ్యక్షుడికి జీ20 ప్రెసిడెన్సీని అప్పగించిన పీఎం మోడీ..
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!