నేటి యువత మద్యానికి బానిసై తమ నిండు జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. మద్యం మత్తులో కన్నుమిన్ను తెలియక అనర్దాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. అయితే పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న యువత మారడం లేదు. మద్యం మత్తులో సుబర్నా పాండే అనే యువతి వీరంగం సృష్టించిన ఘటన తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది.
మద్యం మత్తులో ఇండిగో ఎయిర్లైన్స్ ఉద్యోగి తో సుబర్నా పాండే దురుసుగా ప్రవర్తించింది. అంతేకాకుండా ఆ ఎయిర్ లైన్స్ ఉద్యోగిని బూతులు తిడుతూ దాడికి యత్నించింది. అరగంట పాటు గేట్ నెంబర్ 24 సుబర్నా పాండే వద్ద నానా హంగామా చేసింది. యువతిని ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని, ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అయితే సదరు యువతి హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది.