NTV Telugu Site icon

Rangareddy: ఏసీబీ అదుపులో అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్ రెడ్డి..

Bhupal Reddy

Bhupal Reddy

Rangareddy: రంగారెడ్డి జిల్లాలో మరో అవినీతి తిమింగలంను ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి అదుపులో తీసుకున్నారు. జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో జాయింట్ కలెక్టర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మంగళవారం రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ధరణి వెబ్‌సైట్‌లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను జక్కిడి ముత్యంరెడ్డి కోరారు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఎనిమిది లక్షలు జక్కిడి ముత్యంరెడ్డి నుంచి డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

Read also: Devara: తారక్ ఫ్యాన్స్.. ఆగస్టు 15న దేవర స్పెషల్ వీడియో వస్తోంది..

దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ పథకం ప్రకారం కారులో రూ.8 లక్షలు పెట్టారు. మధుమోహన్ రెడ్డిని విచారించగా.. భూపాల్ రెడ్డి చెబితేనే డబ్బులు తీసుకున్నానని అధికారులకు చెప్పాడు. భూపాల్ రెడ్డికి ఫోన్ చేసిన సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారుల ముందు మాట్లాడాడు. పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్ లో తెలిపారు. పెద్ద అంబర్ పేటలో జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి డబ్బులు ఇస్తుండగా సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇద్దరిని అరెస్ట్ చేసిన అనంతరం భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. భూపాల్ రెడ్డి ఇంట్లో రూ.16 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూపాల్ రెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు.
Cognizant: హైదరాబాద్ లో కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్ కు రేపే శంకుస్థాపన