NTV Telugu Site icon

Rajanna Sircilla Crime: భార్యను చంపి.. ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య..?

Medchel Crime

Medchel Crime

Rajanna Sircilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ లో దూస రాజేశం (54) అనే వ్యక్తి భార్య లక్ష్మి (50)తో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ, పెద్ద కొడుకు వేణు, మౌనిక వివాహం కాగా.. చిన్న కొడుకు వెంకటేష్ బిటెక్ చదువుతున్నాడు. అయితే రాజేశంకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇక ఇక్కడి నుంచి వారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. సంతోషంగా వున్న వీరి జీవతంలో కుటుంబ కలహాలు నరకయాతనకు గురిచేశారు. గత ఆరు నెలల నుండి ఉపాధి లేకపోవడంతో తరుచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఏందో విషయంలో భార్య భర్తలిద్దరూ గొడవ పడేవారు.

Read also: Cast Reservation : బీహార్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే ?

భార్య సూటి పోటి మాటలకు రాజేశం విసుగు చెందాడు. భార్య లక్ష్మి బెడ్ రూం లో ఉండగా.. లోనికి వెళ్లాడు.. ఆమెను బెడ్ రూంలో బలమైన ఆయుధంతో మొహం పై కొట్టి చంపాడు. భార్యను చంపి అనంతరం భర్త రాజేశం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో భార్యను చంపి రాజేశం కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబంలో విషాదం నెలకుంది. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్న ఇంట్లో ఎవరు లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా.. చిన్న కొడుకు వేణు మా అమ్మను చంపి నాన్న ఉరివేసుకొని చనిపోయాడని పోలీసులకు తెలిపారు. అయితే ఇంట్లో భార్యభర్తలిద్దరూ గొడవ జరుగుతున్నప్పుడు చిన్న కొడుకు వేణు ఉన్నట్లు తెలిపారు. ఇంకా ఆధారాలకోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
Srisailam Dam: పర్యటకులకు అలర్ట్‌.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తివేత..