Raja Singh: మతం ప్రబలింది మరోసారి మీ సేవకు హాజరయ్యాను రాజా సింగ్ ట్వీట్ వైరల్
Raja Singh: మత విద్వేష వ్యాఖ్యల కేసులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎట్టకేలకు ఊరట లభించింది. దాదాపు 40 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన ఆయనకు బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ.. తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ను ధర్మాసనం మంజూరు చేసింది. ఇకపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, ముఖ్యంగా మతాలను కించపరిచే విధంగా అభ్యంతకరమైన కామెంట్లు చేయకూడదని సూచించింది. అలాగే.. మీడియా ముందుకు రాకూడదని, 3 నెలల వరకు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయకూడదని, జైలు నుంచి విడుదలయ్యే వేళ ర్యాలీలు సైతం నిర్వహించకూడదని షరతులు విధించింది.
అయితే నిన్న బుధవారం బెయిల్ పై బయటకు వచ్చిన రాజాసింగ్ తన సోషల్మీడియాలో ఓపోస్ట్ వైరల్ గా మారింది. మతం ప్రబలింది మరోసారి మీ సేవకు హాజరయ్యాను జై శ్రీరామ్ అంటూ చేసిన ఓపోస్ట్ చర్చకు దారితీస్తోంది. పలు షరతులతో బయటకు వచ్చిన తన ట్విటర్ ఖాతాలో చేసిన పోస్ట్ మళ్లీ చర్చకు దారితీస్తోంది. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చేయడంతో ధర్మాసనం షరతులను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మీడియా ముందుకు రాకూడదని, 3 నెలల వరకు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయకూడదని షరతులు విధించిని బేఖారు చేసిన రాజాసింగ్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్కు మరి ధర్మాసనం ఎలా సందించనుందో చూడాలి.
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
అయితే.. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షోను హైదరాబాద్లో నిర్వహించొద్దని మొదటి నుంచి రాజాసింగ్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే! అయితే.. తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత మధ్య అతని షో నిర్వహించడంతో, అందుకు ప్రతీకారంగా రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంతో.. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగింది. అప్పుడు బీజేపీ రాజాసింగ్ని సస్పెండ్ చేసింది. ఆ సమయంలోనే సమాజంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాజాసింగ్ వ్యవహరిస్తున్నారంటూ.. ఆయనపై ఆగస్టు 25న పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని రాజాసింగ్ భార్య ఉషాబాయి వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కౌంటరు దాఖలు చేశారు. అటు రాజాసింగ్ తరఫు న్యాయవాది రవిచందర్, ఇటు అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ తమతమ వాదనలు వినిపించారు. మంగళవారం ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. బుధవారం షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
धर्म की विजय हुई।
एक बार पुनः आपकी सेवा में उपस्थित होगया हु।
जय श्री राम 🚩 pic.twitter.com/UM2LcpxuMu
— Raja Singh (@TigerRajaSingh) November 9, 2022
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!