Telangana Rains: రాష్ట్రంలో భిన్న వాతావరణం.. 19 జిల్లాల్లో వానలకు ఛాన్స్
Telangana Rains: అధిక ఉష్ణోగ్రతలు, వర్షంతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరోవైపు ఈ మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 19 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం: ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు (ప్రతి గంటలకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో) నేడు, రేపు, ఎల్లుండి (మంగళ, బుధ, గురు) రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
Read also: Pomegranate Leaves: దానిమ్మ ఆకులను ఇలా తీసుకుంటే చాలు.. ఆ సమస్యలు దూరం..
Also Read
ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వివిధ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా.. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్ద పల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. . పేర్కొన్నారు. వర్షాల కారణంగా ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Read also: 30 Years Prudhvi: పావలా కాదు యాంకర్ శ్యామల… చెప్పులు, చీపుళ్ళతో కొడతామంటూన్నారు!
మెదక్, సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రామాయంపేట, నార్సింగి, శివునూరు, కుకునూర్ పల్లి, గజ్వేల్, కొండపాకలో తేలికపాటి వర్షం కురుస్తుంది. వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. అకాల వర్షం వల్ల వరి, మామిడి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలికి రాలిపోయిన మామిడి కాయలు, వరి పొలాలు నేల కొరికేస్తున్నాయని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాతావరణం చల్లబడింది. హన్మకొండ జిల్లాలో వాతావరణం మేఘావృతమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సోమవారం వడగళ్ల వాన కురిసింది. మరికొన్ని చోట్ల అక్కడక్కడ వర్షం కురిసింది.
PM Modi: అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!