Professor Haragopal: ఉద్యోగాలు లేవు.. విద్యా విధానాన్ని ధ్వంసం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Professor Haragopal Fires On CM KCR: ప్రొఫెసర్ హరగోపాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారని.. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఎంతోమంది నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొన్ని దేశాల్లో హింస లేకుండా శాంతియుత పాలన సాగుతోందని.. సమాజంలో నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడే హింసలకు పాల్పడుతారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు అనుకున్నారని.. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానాన్ని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి, నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని రిజర్వేషన్ అడుగుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుతున్నారని, రూ. 5 భోజనం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఐటీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
అంతకుముందు కూడా.. తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న నేరాల విషయంలోనూ ప్రభుత్వ విధానాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ దుయ్యబట్టారు. చదువుకుంటున్న పిల్లలు కూడా నేరాల్లో పాల్గొంటున్నారని, ప్రభుత్వం ఆ నేరాలను కంట్రోల్ చేయకుండా నేరం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు.. సమాజానికి ఏం విలువలు ఇస్తున్నామనేది చూసుకోవాలని సూచించారు. తెలంగాణ వస్తే మెరుగైన సమాజం వస్తుందని అనుకున్నామని.. కానీ అత్యాచారాలు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం లాంటివి దుర్మార్గమైన చర్యలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనల్ని ఎలా కట్టడి చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. తెలంగాణను ప్రజాస్వామ్య సమాజంగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని విమర్శించిన ఆయన.. పాత చట్టాలు ఉంటే రాష్ట్రం ఏం మారుతుంది? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం రాసిన పాటలు కూడా బ్యాన్ అయ్యాయని.. అన్ని జేఏసీలు ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. ఇష్టారాజ్యంగా పబ్బులు పెంచారని.. ఇది చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!