Professor Haragopal: ఉద్యోగాలు లేవు.. విద్యా విధానాన్ని ధ్వంసం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Professor Haragopal Fires On CM KCR: ప్రొఫెసర్ హరగోపాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారని.. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఎంతోమంది నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొన్ని దేశాల్లో హింస లేకుండా శాంతియుత పాలన సాగుతోందని.. సమాజంలో నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడే హింసలకు పాల్పడుతారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు అనుకున్నారని.. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానాన్ని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి, నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని రిజర్వేషన్ అడుగుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుతున్నారని, రూ. 5 భోజనం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఐటీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
అంతకుముందు కూడా.. తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న నేరాల విషయంలోనూ ప్రభుత్వ విధానాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ దుయ్యబట్టారు. చదువుకుంటున్న పిల్లలు కూడా నేరాల్లో పాల్గొంటున్నారని, ప్రభుత్వం ఆ నేరాలను కంట్రోల్ చేయకుండా నేరం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు.. సమాజానికి ఏం విలువలు ఇస్తున్నామనేది చూసుకోవాలని సూచించారు. తెలంగాణ వస్తే మెరుగైన సమాజం వస్తుందని అనుకున్నామని.. కానీ అత్యాచారాలు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం లాంటివి దుర్మార్గమైన చర్యలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనల్ని ఎలా కట్టడి చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. తెలంగాణను ప్రజాస్వామ్య సమాజంగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని విమర్శించిన ఆయన.. పాత చట్టాలు ఉంటే రాష్ట్రం ఏం మారుతుంది? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం రాసిన పాటలు కూడా బ్యాన్ అయ్యాయని.. అన్ని జేఏసీలు ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. ఇష్టారాజ్యంగా పబ్బులు పెంచారని.. ఇది చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..