Pralhad Joshi: దేశం, తెలంగాణ కన్నా.. కేసీఆర్కు కుటుంబమే ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pralhad Joshi Warns CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన ఆరోపణలు చేశారు. ఈ భారతదేశం, తెలంగాణ రాష్ట్రం కన్నా.. కేసీఆర్కు తన కుటుంబమే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. బియ్యం రీ-సైక్లింగ్లో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని అభియోయాలున్నాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్కి హాజరు కాలేదని.. డబుల్ బెడ్రూం హామీల్ని నెరవేర్చకపోవడంతో పాటు అవాస్ యోజన ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. అటు.. ఎంఐఎంతో కలిసి పాతబస్తీలో మెట్రో రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. తన కుటుంబంలో ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారే తప్ప, నిరుద్యోగ యువతని గాలికొదిలేశారన్నారు. కాగ్ రిపోర్ట్ కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ – బీజాపూర్ హైవేకి కేంద్రం 2017లోనే 924 కోట్లు కేటాయించిందని.. అయితే భూ సేకరణ చేయకపోవడం వల్ల పనులు జరగడం లేదని అన్నారు.
రైల్వే ప్రాజెక్ట్ల కోసం కూడా కేంద్రం 2019-20లో 2057 కోట్లు, 2020-21లో 2602 కోట్లు, 2021-22లో 2420 కోట్లు, 2022-23లో 3500 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూ సేకరణకు ఏమాత్రం సహకరించడం లేదని చెప్పారు. సొంత సంపాదనపై ఉన్న శ్రద్ధ.. ప్రాజెక్ట్ల మీద ఏమాత్రం లేదని ఆగ్రహించారు. సంబంధిత సంస్థల ఆమోదం లేకుండా నిధులు ఖర్చు చేశారని.. ఈ విషయంపై కాగ్ సీరియస్ ఆరోపణలు కూడా చేసిందని అన్నారు. కేంద్రం ఇస్తున్న పథకాలు అమలు చేయకపోతే, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకపోతే.. ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని ప్రహ్లాద్ జోషి హెచ్చరించారు.
Also Read
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!