Pralhad Joshi: దేశం, తెలంగాణ కన్నా.. కేసీఆర్కు కుటుంబమే ఎక్కువ
Pralhad Joshi Warns CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన ఆరోపణలు చేశారు. ఈ భారతదేశం, తెలంగాణ రాష్ట్రం కన్నా.. కేసీఆర్కు తన కుటుంబమే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. బియ్యం రీ-సైక్లింగ్లో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని అభియోయాలున్నాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్కి హాజరు కాలేదని.. డబుల్ బెడ్రూం హామీల్ని నెరవేర్చకపోవడంతో పాటు అవాస్ యోజన ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. అటు.. ఎంఐఎంతో కలిసి పాతబస్తీలో మెట్రో రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. తన కుటుంబంలో ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారే తప్ప, నిరుద్యోగ యువతని గాలికొదిలేశారన్నారు. కాగ్ రిపోర్ట్ కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ – బీజాపూర్ హైవేకి కేంద్రం 2017లోనే 924 కోట్లు కేటాయించిందని.. అయితే భూ సేకరణ చేయకపోవడం వల్ల పనులు జరగడం లేదని అన్నారు.
రైల్వే ప్రాజెక్ట్ల కోసం కూడా కేంద్రం 2019-20లో 2057 కోట్లు, 2020-21లో 2602 కోట్లు, 2021-22లో 2420 కోట్లు, 2022-23లో 3500 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూ సేకరణకు ఏమాత్రం సహకరించడం లేదని చెప్పారు. సొంత సంపాదనపై ఉన్న శ్రద్ధ.. ప్రాజెక్ట్ల మీద ఏమాత్రం లేదని ఆగ్రహించారు. సంబంధిత సంస్థల ఆమోదం లేకుండా నిధులు ఖర్చు చేశారని.. ఈ విషయంపై కాగ్ సీరియస్ ఆరోపణలు కూడా చేసిందని అన్నారు. కేంద్రం ఇస్తున్న పథకాలు అమలు చేయకపోతే, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకపోతే.. ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని ప్రహ్లాద్ జోషి హెచ్చరించారు.
Also Read
- Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
- KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
- DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
- Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
తాజావార్తలు
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
-
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
-
Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!