Prakash Ambedkar: హుజూరాబాద్ కు ప్రత్యేక చాపర్ లో బయలుదేరిన ప్రకాశ్ అంబేద్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Ambedkar: దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తీరంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు, మాజీ ఎంపీ ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన బాబాసాహెబ్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ కు మంత్రి గంగుల కమలాకర్ ఘనస్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి దళిత బంధు జ్ఞాపికను అందజేశారు.
ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్తో పాటు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక చాపర్లో హుజూరాబాద్కు బయలుదేరారు. హుజూరాబాద్లో దళితబందు లబ్ధిదారులను కలుస్తారు. వారి అనుభవాలు, దళిత బంధు వారి జీవితాలలో వచ్చిన మార్పుల గురించి వారు తెలుసుకుంటారు. మంత్రి గంగుతో పాటు విప్ బాల్క సుమన్, ఇతర ఉన్నతాధికారులు ప్రకాష్ అంబేద్కర్ను హుజూరాబాద్ దళితబందు లబ్ధిదారుల వద్దకు తీసుకెళ్లి, పర్యటన అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
Read also: Pharmacy Employ Typing : అమ్మో అదేం టైపింగ్ రా బాబు.. కీ బోర్డ్ ను గడగడలాడించిన ఫార్మసీ ఎంప్లాయ్
హైదరాబాద్లోని ట్యాంక్బండ్లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు 125 అడుగుల డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాలు మూసివేయబడంతో పాటు దారి మళ్లించబడతాయి. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ మార్గాల్లో వచ్చే ట్రాఫిక్ను ఇతర మార్గాల్లో మళ్లిస్తామని, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్క్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ట్యాంక్బండ్పై వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక వ్యక్తి అరెస్ట్..!
తాజావార్తలు
-
2027 World Cup: : పంత్, శాంసన్లకు నో ఛాన్స్.. అశ్విన్ ప్రకటించిన జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!