Prakash Ambedkar: హుజూరాబాద్ కు ప్రత్యేక చాపర్ లో బయలుదేరిన ప్రకాశ్ అంబేద్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Ambedkar: దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తీరంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు, మాజీ ఎంపీ ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన బాబాసాహెబ్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ కు మంత్రి గంగుల కమలాకర్ ఘనస్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి దళిత బంధు జ్ఞాపికను అందజేశారు.
ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్తో పాటు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక చాపర్లో హుజూరాబాద్కు బయలుదేరారు. హుజూరాబాద్లో దళితబందు లబ్ధిదారులను కలుస్తారు. వారి అనుభవాలు, దళిత బంధు వారి జీవితాలలో వచ్చిన మార్పుల గురించి వారు తెలుసుకుంటారు. మంత్రి గంగుతో పాటు విప్ బాల్క సుమన్, ఇతర ఉన్నతాధికారులు ప్రకాష్ అంబేద్కర్ను హుజూరాబాద్ దళితబందు లబ్ధిదారుల వద్దకు తీసుకెళ్లి, పర్యటన అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు.
Also Read
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
Read also: Pharmacy Employ Typing : అమ్మో అదేం టైపింగ్ రా బాబు.. కీ బోర్డ్ ను గడగడలాడించిన ఫార్మసీ ఎంప్లాయ్
హైదరాబాద్లోని ట్యాంక్బండ్లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు 125 అడుగుల డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాలు మూసివేయబడంతో పాటు దారి మళ్లించబడతాయి. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ మార్గాల్లో వచ్చే ట్రాఫిక్ను ఇతర మార్గాల్లో మళ్లిస్తామని, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్క్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ట్యాంక్బండ్పై వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక వ్యక్తి అరెస్ట్..!
తాజావార్తలు
-
Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
-
US-Iran War: ‘ట్రంప్ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
-
ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!