NTV Telugu Site icon

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పూజా హెగ్డే

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ ప్రారంభించి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విస్తృతమవుతుంది. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌లో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడాలని నిరంతరం పరితపిస్తూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను చేపట్టారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటే ఈ బృహత్తర కార్యక్రమం ఖండాంతరాలు దాటి ప్రతీ హృదయాన్ని కదిలిస్తుంది. చేయి చేయి పట్టి మొక్కలు నాటిస్తుంది. ఇది ఒక ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతుంది.

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్” ను స్వీకరించిన తెలుగింటి బుట్టబొమ్మ పూజాహెగ్డే, ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కను నాటారు. అనంతరం, బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్‌ కి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” విసురుతున్నట్టు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజంపై బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ “గ్రీన్ ఇండియా చాలెంజ్” గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టడానికి దోహదపడుతుందన్నారు. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో.. “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.