CP Mahesh Bhagwat: షోరూమ్ లో ఫింగర్ ప్రింట్స్.. అదుపులో అంతర్ రాష్ట్ర నేరస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Mahesh Bhagwat: హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలిస్ స్టేషన్ పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. వారి వద్దనుంచి 70 లక్షల విలువైన మొబైల్ ఫోన్ల రికవరీ చేసారు. జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అంతర్ రాష్ట్ర నేరస్తుల అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత నెల 21 న కుషాయిగూడ పోలిస్ స్టేషన్ పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ చోరీ జరిగిందని, 70 లక్షల విలువైన 432 సెల్ ఫోన్లు చోరీ గురైనట్లు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశామన్నారు. సీసీఎస్, ఎస్ఓటి, క్లూస్ టీమ్, మల్కాజ్గిరి, కుషాయిగూడ పోలీసులతో టీమ్ ఏర్పాటుచేసినట్లు మహేశ్ భగవత్ అన్నారు. వెంటిలేటర్ ద్వారా లోపలికి వచ్చి చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. 500 సీసీ కెమెరాలు స్కాన్ చేశామని తెలిపారు. షోరూమ్ లో ఫింగర్ ప్రింట్స్ సేకరించామని, షోరూమ్ సిబ్బందిని కూడా విచారించామన్నారు. ఒక చిన్న సమాచారం వచ్చింది, జార్ఖండ్ కు చెందిన ముఠా అని అర్థమైందని మహేశ్ భగవత్ తెలిపారు.
Read also: మీ మూడ్, శక్తి పెరగాలా..? అయితే ఈ 8 ఫ్రూట్స్ ట్రై చేయండి..
Also Read
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
- CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ఒకఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యిందని, ఆ ప్రింగర్ ప్రింట్ సహాయంతో.. మహారాష్ట్ర కు చెందిన ఓ కేసులో ఒక బాల నేరస్తుడికి చెందిన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యిందని అన్నారు. అప్పుడు ఓ కొలిక్కి వచ్చి జార్ఖండ్ కు చెందిన ముఠా చేసినట్లు గుర్తించామన్నారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక టీమ్ ను పంపించామని తెలిపారు. చోరీ చేసిన సొత్తును ఈ ముఠా నేపాల్, బంగ్లాదేశ్ కు పంపిస్తారని పేర్కొన్నారు. వారం రోజుల తరువాత సత్తార్ షేక్ ను పట్టుకున్నామని తెలిపారు. షోరూమ్ లో చోరీ కి గురైన మొబైల్ ను అతని దగ్గర స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం ఆరుగురు చోరీ కి వచ్చారని పేర్కొన్నారు. మరో పోలీస్ టీమ్ అసిదుల్ షేక్ను పట్టుకున్నారని, అక్కడి నుండి పీపీ వారెంట్ పై తీసుకువచ్చామని మహేశ్ భగవత్ తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం అంత సులభం కాదన్న ఆయన పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కాల్పులు జరిపే అవకాశం ఉందని అన్నారు. ఈ కేసు లో ఫింగర్ ప్రింట్ దొరకడం చాలా ఇంపార్టెన్స్ ఉందని, వ్యాపారులు అలారం సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాలని సలహాఇచ్చారు. క్లూస్ టీమ్ అధికారి మాట్లాడుతూ.. చోరీ జరిగిన తరువాత 24 గంటలు షోరూమ్ లోనే ఉండి అణువణువు గాలించామని తెలిపారు. చివరకు ఒక చిన్న ఫింగర్ ప్రింట్ దొరికడంతో వారి పని సులువైందని అన్నారు. ఆ వివరాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఇచ్చామని, మొత్తం పది టీమ్ లు ఏర్పాటు చేశామని చిరవకు దొంగలను పట్టుకున్నామని వివరించారు.
Free Ration: రేషన్కార్డుదారులకు శుభవార్త.. మరోసారి 10 కిలో ఉచిత బియ్యం పంపిణీ
తాజావార్తలు
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!