CP Mahesh Bhagwat: షోరూమ్ లో ఫింగర్ ప్రింట్స్.. అదుపులో అంతర్ రాష్ట్ర నేరస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Mahesh Bhagwat: హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలిస్ స్టేషన్ పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. వారి వద్దనుంచి 70 లక్షల విలువైన మొబైల్ ఫోన్ల రికవరీ చేసారు. జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అంతర్ రాష్ట్ర నేరస్తుల అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత నెల 21 న కుషాయిగూడ పోలిస్ స్టేషన్ పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ చోరీ జరిగిందని, 70 లక్షల విలువైన 432 సెల్ ఫోన్లు చోరీ గురైనట్లు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశామన్నారు. సీసీఎస్, ఎస్ఓటి, క్లూస్ టీమ్, మల్కాజ్గిరి, కుషాయిగూడ పోలీసులతో టీమ్ ఏర్పాటుచేసినట్లు మహేశ్ భగవత్ అన్నారు. వెంటిలేటర్ ద్వారా లోపలికి వచ్చి చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. 500 సీసీ కెమెరాలు స్కాన్ చేశామని తెలిపారు. షోరూమ్ లో ఫింగర్ ప్రింట్స్ సేకరించామని, షోరూమ్ సిబ్బందిని కూడా విచారించామన్నారు. ఒక చిన్న సమాచారం వచ్చింది, జార్ఖండ్ కు చెందిన ముఠా అని అర్థమైందని మహేశ్ భగవత్ తెలిపారు.
Read also: మీ మూడ్, శక్తి పెరగాలా..? అయితే ఈ 8 ఫ్రూట్స్ ట్రై చేయండి..
Also Read
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
ఒకఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యిందని, ఆ ప్రింగర్ ప్రింట్ సహాయంతో.. మహారాష్ట్ర కు చెందిన ఓ కేసులో ఒక బాల నేరస్తుడికి చెందిన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యిందని అన్నారు. అప్పుడు ఓ కొలిక్కి వచ్చి జార్ఖండ్ కు చెందిన ముఠా చేసినట్లు గుర్తించామన్నారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక టీమ్ ను పంపించామని తెలిపారు. చోరీ చేసిన సొత్తును ఈ ముఠా నేపాల్, బంగ్లాదేశ్ కు పంపిస్తారని పేర్కొన్నారు. వారం రోజుల తరువాత సత్తార్ షేక్ ను పట్టుకున్నామని తెలిపారు. షోరూమ్ లో చోరీ కి గురైన మొబైల్ ను అతని దగ్గర స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం ఆరుగురు చోరీ కి వచ్చారని పేర్కొన్నారు. మరో పోలీస్ టీమ్ అసిదుల్ షేక్ను పట్టుకున్నారని, అక్కడి నుండి పీపీ వారెంట్ పై తీసుకువచ్చామని మహేశ్ భగవత్ తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం అంత సులభం కాదన్న ఆయన పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కాల్పులు జరిపే అవకాశం ఉందని అన్నారు. ఈ కేసు లో ఫింగర్ ప్రింట్ దొరకడం చాలా ఇంపార్టెన్స్ ఉందని, వ్యాపారులు అలారం సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాలని సలహాఇచ్చారు. క్లూస్ టీమ్ అధికారి మాట్లాడుతూ.. చోరీ జరిగిన తరువాత 24 గంటలు షోరూమ్ లోనే ఉండి అణువణువు గాలించామని తెలిపారు. చివరకు ఒక చిన్న ఫింగర్ ప్రింట్ దొరికడంతో వారి పని సులువైందని అన్నారు. ఆ వివరాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఇచ్చామని, మొత్తం పది టీమ్ లు ఏర్పాటు చేశామని చిరవకు దొంగలను పట్టుకున్నామని వివరించారు.
Free Ration: రేషన్కార్డుదారులకు శుభవార్త.. మరోసారి 10 కిలో ఉచిత బియ్యం పంపిణీ
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!