TSRTC: ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లకు నో హాలీడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. గతంలో వివిధ రూట్లలో పల్లెటూరి బస్సుల్లో ప్రయాణించే వారు ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఎక్స్ ప్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. గత ఆదివారంతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య 15 శాతం పెరగలేదని అధికారులు వెల్లడించారు. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలు, యువతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఈ నెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి రావడంతో.. చాలా మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. అయితే.. గత ఆదివారం (డిసెంబర్ 3)తో పోలిస్తే ఈ ఆదివారం (డిసెంబర్ 10) దాదాపు 15 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సు ప్రయాణికుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని తెలిపారు. టిమ్స్లో ‘జీరో టికెట్’ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చాక వాస్తవ సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు.
Read also: PrajaVani: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు
Also Read
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
- KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
ఇతర రోజుల కంటే సోమవారాలు బస్సులు సాధారణంగా రద్దీగా ఉంటాయి. నేడు కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్ల సెలవులను రద్దు చేశారు. సిబ్బందికి సెలవులు లేవని, విధులకు హాజరుకావాలన్నారు. వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, రామప్ప వంటి శైవక్షేత్రాలకు అధిక సంఖ్యలో బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో బస్సులు 31-32 లక్షల కిలోమీటర్లు నడుస్తుండగా, సోమవారం నాటికి వాటి సంఖ్య 34 లక్షల కిలోమీటర్లకు పెరిగింది. ఈరోజు 10 శాతానికి పైగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తుంది.
Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..