కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాత్రి నుండి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉండనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. నేటి నుంచి మే 1 వరకు కర్ఫ్యూ కొనసాగునుంది. అత్యవసర సర్వీసులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కర్ఫ్యూ నుంచి మీడియా, పెట్రోల్ బంకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్ సర్వీసులు, మెడికల్ షాపులకు మినహాయింపులు ఇచ్చింది ప్రభుత్వం. ఇక నైట్ కర్ఫ్యూ కారణంగా బార్లు, క్లబ్బులు, వైన్స్, షాపింగ్ మాల్స్ రాత్రి పూట మూతపడనున్నాయి.
బిగ్ బ్రేకింగ్ : తెలంగాణాలో ఇవాళ్టి నుంచి రాత్రి కర్ఫ్యూ
