Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

  • మంత్రి కొండా సురేఖకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ
  • KTR దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో జారీ అయిన NBW
  • కేసు విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా.
Konda Surekha

Konda Surekha

Konda Surekha : మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఇటీవల మంత్రి సురేఖ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతోంది.

Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. హసీనా పదవీచ్యుతి తర్వాత తొలి ఎలక్షన్స్..

×
×
Ad

అయితే.. నిర్దేశించిన తేదీన విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడంతో, కోర్టు కఠినంగా స్పందించింది. హాజరు నిర్లక్ష్యం చేసినందుకు ఆమెపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు వెలువరించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని పోలీసులకు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని కొండా సురేఖను కోర్టు ఆదేశించింది.

Telangana Rising Global Summit : గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి రెండో రోజున పెద్దఎత్తున సందర్శకులు