Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Narendra Modi Call To Reduce Gold Purchases Save Foreign Exchange

Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!

Published Date :May 10, 2026 , 7:57 pm
By Gogikar Sai Krishna
  • పరేడ్ గ్రౌండ్స్ సభలో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని
  • విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడాలని ప్రజలకు మోడీ విజ్ఞప్తి
  • మెట్రో, ఈవీల వినియోగం పెంచాలని సూచన
  • స్వదేశీ వస్తువుల వాడకంతోనే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమన్న ప్రధాని
Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Narendra Modi : తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. “నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా..” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రజలు పాటించాల్సిన పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఇంధన సంక్షోభం తలెత్తినప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా జాగ్రత్త పడుతున్నామని ప్రధాని తెలిపారు. అయితే, విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రజలు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని, అలాగే విదేశీ పర్యటనలను కూడా వాయిదా వేసుకోవాలని కోరారు. వీటితో పాటు వంట నూనెల వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించారు. దేశం నుంచి బయటకు వెళ్లే ధనాన్ని అరికట్టడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read

  • PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
  • Narendra Modi : సీఎం రేవంత్‌కు మోడీ కౌంటర్‌..
  • CM Revanth Reddy: గుజరాత్‌కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
Add as a preferred
source on google

ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలని ప్రధాని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో కూడా భారీ మార్పులు రావాలని ఆకాంక్షించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రసాయన ఎరువుల వల్ల భూమికి నష్టం వాటిల్లడమే కాకుండా దేశ సంపద కూడా కరిగిపోతోందని, అందుకే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. వ్యవసాయంలో డీజిల్ ఇంజన్లకు బదులుగా సౌర శక్తితో నడిచే పంపు సెట్లను ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు.

స్వదేశీ వస్తువుల వినియోగంపై ప్రధాని ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. స్వదేశీ గురించి మాట్లాడగానే చాలామంది కేవలం దీపావళి దీపాల గురించే ఆలోచిస్తారని, కేవలం మట్టి దీపాలు కొన్నంత మాత్రాన స్వదేశీని పూర్తిస్థాయిలో ప్రోత్సహించినట్లు కాదని స్పష్టం చేశారు. ప్రతి రోజూ వాడే వస్తువుల నుంచి వ్యవసాయ పరికరాల వరకు సాధ్యమైనంత వరకు భారత్‌లో తయారైన వస్తువులనే వాడాలని, అప్పుడే నిజమైన ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. దేశాభివృద్ధి కోసం ప్రజలందరూ ఈ క్రమశిక్షణను పాటించాలని ఆయన కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Atmanirbhar Bharat
  • Economy
  • gold purchase
  • Narendra Modi
  • telangana tour

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!

  • PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!

  • Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!

  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..

  • Money Heist: ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions