Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
- పరేడ్ గ్రౌండ్స్ సభలో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని
- విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడాలని ప్రజలకు మోడీ విజ్ఞప్తి
- మెట్రో, ఈవీల వినియోగం పెంచాలని సూచన
- స్వదేశీ వస్తువుల వాడకంతోనే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమన్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi : తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. “నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా..” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రజలు పాటించాల్సిన పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఇంధన సంక్షోభం తలెత్తినప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా జాగ్రత్త పడుతున్నామని ప్రధాని తెలిపారు. అయితే, విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రజలు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని, అలాగే విదేశీ పర్యటనలను కూడా వాయిదా వేసుకోవాలని కోరారు. వీటితో పాటు వంట నూనెల వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించారు. దేశం నుంచి బయటకు వెళ్లే ధనాన్ని అరికట్టడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలని ప్రధాని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో కూడా భారీ మార్పులు రావాలని ఆకాంక్షించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రసాయన ఎరువుల వల్ల భూమికి నష్టం వాటిల్లడమే కాకుండా దేశ సంపద కూడా కరిగిపోతోందని, అందుకే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. వ్యవసాయంలో డీజిల్ ఇంజన్లకు బదులుగా సౌర శక్తితో నడిచే పంపు సెట్లను ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు.
స్వదేశీ వస్తువుల వినియోగంపై ప్రధాని ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. స్వదేశీ గురించి మాట్లాడగానే చాలామంది కేవలం దీపావళి దీపాల గురించే ఆలోచిస్తారని, కేవలం మట్టి దీపాలు కొన్నంత మాత్రాన స్వదేశీని పూర్తిస్థాయిలో ప్రోత్సహించినట్లు కాదని స్పష్టం చేశారు. ప్రతి రోజూ వాడే వస్తువుల నుంచి వ్యవసాయ పరికరాల వరకు సాధ్యమైనంత వరకు భారత్లో తయారైన వస్తువులనే వాడాలని, అప్పుడే నిజమైన ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. దేశాభివృద్ధి కోసం ప్రజలందరూ ఈ క్రమశిక్షణను పాటించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!