Ramappa Temple: రామప్ప గొల్లాల గుడిలో దారుణం.. గుప్త నిధుల కోసం శిల్పాలు ధ్వంసం..
- యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఉప ఆలయాలకు రక్షణ కరువైంది..
- గుప్త నిధుల కోసం గొల్లాల గుడిలోని శిల్పాలను ధ్వంసం చేసి దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramappa Temple: యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా రామప్ప దేవాలయం పరిధిలోని ఉప ఆలయాలకు రక్షణ కరువైంది. గొల్లాల గుడిలో గుప్తనిధుల కోసం గుర్తు తెలియని దుండగుల చేతిలో ధ్వంసం చేశారు. పురావస్తు శాఖ సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం గొల్లాల గుడి దేవాలయం శుభ్రం చేయడానికి వెళ్ళగా దేవాలయం పైకప్పు తీసి కిందపడేసి నిచ్చెన ద్వారా దుండగులు లోపలికి దూరినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దేవాలయం లోపల శివలింగంతో పాటు శిల్పాలను దుండగులు పెకిలించినట్లు అనుమానిస్తున్నారు. దేవాలయం లోపల పువ్వు ఆకారంలో ఉన్న శిల్పాన్ని పగలగొట్టి పక్కకు పడేశారు దాని కింద గుప్తనిధులు ఉన్నాయని అనుమానంతో పగలగొట్టినట్లు అనుమానిస్తున్నారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న గొల్లాల గుడి శిథిలావస్థలో ఉండగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రెండు సంవత్సరాల క్రితం దేవాలయంలోని శిల్పాలతో పాటు శివలింగం పునరుద్ధరణ చేశారు. దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేటుకు తాళం వేసి ఉంచుతున్నారు.
Read also: Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
ఆలయంలో ధూప దీప నైవేద్యం లేనప్పటికీ.. ఆలయం చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించి.. వచ్చే భక్తులు దర్శించుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు. కానీ దేవాలయంలోకి భక్తుల దర్శనానికి పురవస్తు శాఖ ఇంకా అనుమతించడం లేదు. పురావస్తు శాఖ అధికారులు దేవాలయం కు రక్షణ కల్పించడంలో విఫలమైనట్లు విమర్శలు వస్తున్నాయి. యునెస్కో గుర్తింపు పొంది రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పేరెందిన ప్రముఖ శైవ క్షేత్రంగా రామప్ప దేవాలయం విరాజిల్లుతుంది. దాన్ని కాపాడుకుంటూ రక్షించుకోవాల్సిన బాధ్యత పురావస్తుశాఖ అధికారులకు ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు ఆలయానికి జరిగిన డ్యామేజీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!