Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Muhurthams For Deliveries In Nizamabad

Muhurthams For Deliveries: ప్రసవాలకు ముహూర్తాలు.. ఎడాపెడా సిజేరియన్లు

Published Date :May 25, 2022 , 5:29 pm
By NTV WebDesk
Muhurthams For Deliveries: ప్రసవాలకు ముహూర్తాలు.. ఎడాపెడా సిజేరియన్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమ్మతనం దేవుడిచ్చిన వరం. గతంలో ప్రసవానికి ఆస్పత్రులకు వెళ్లేవారు. డాక్టర్ చెప్పిన విధంగానే ప్రసవాలు జరిగేవి. నార్మల్ డెలివరీలే ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు తరం మారింది. వారి ఆలోచనలు కూడా మారాయి. ముహుర్తం చూసుకుని మరీ పిల్లలను కంటున్నారు నేటి తరం అమ్మలు. పిల్లలు ఎప్పుడు పుట్టాలో కుటుంబ సభ్యులు నిర్ణయిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణ కాన్పుల సంఖ్య భారీగా తగ్గడంతో. సర్కారు మహుర్తపు కాన్పులను తగ్గించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. నేటి తరం అమ్మలు కాన్పు నొప్పి భరించలేకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల కక్కుర్తితో ప్యాకేజీల పేరిట అడ్డగోలుగా కోతలు పెడుతుండటంతో.. కడుపు కోతల్లో నిజామాబాద్‌ అగ్ర స్దానానికి చేరింది.

నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ప్రసవాల గణాంకాలు.. వైద్యశాఖ ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ప్రసవాలకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్న గర్బిణీలకు.. వేదనే మిగులుతోంది. ప్యాకేజీల పేరుతో పలు ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డగోలుగా కడుపు కోత పెడుతున్నారు. ఇంకొందరు వైద్యులు ప్రసవాలను వ్యాపారంగా మార్చేశారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సాధారణ ప్రసవాలు 1500 జరిగితే.. సిజేరియన్లు 15వేల వరకు చేశారు ప్రైవేట్ వైద్యులు. ఇటు సర్కారు ఆసుపత్రుల్లోనూ రెట్టింపు స్దాయిలో సిజేరియన్లు జరుగుతున్నాయి. కొందరు నేటి తరం అమ్మలు పురిటి నొప్పులు భరించలేక.. ఆపరేషన్ చేసుకుంటుంటే మరికొందరు తల్లుల కుటుంబ సభ్యులు మహుర్తం చూసుకుని మరీ సిజేరీయన్లు చేయిస్తున్నారు.

Also Read

  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
  • Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
  • Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..

ప్రైవేట్ లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. రోజు, తేదీ, సమయం వంటివి పంతుళ్లకు చూపించుకుని మరీ ఆపరేషన్ చేయిస్తున్నారు. ఈ ధోరణి మంచిది కాదని.. పండితులు చెబుతున్నారు. ప్రసవానికి ముహుర్తం చూడమని చాలా మంది వస్తున్నారని.. మంచి మహుర్తం చూసి పెడుతున్నామని పంతుళ్లు చెబుతున్నారు. ఈ పరిస్దితిలో మార్పు రావాలని కోరుతున్నారు. నేటి తరం తల్లులు ఎక్కువ మంది మంచి ముహుర్తపు ప్రసవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు, సమయం, స్ధలంతో పాటు అనస్దీషియా ఇవ్వడం, బిడ్డ బయటకు రావడం కూడా కుటుంబ సభ్యులు నిర్ణయిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

పంతులు నిర్ణయించిన సమయం ఖచ్చితంగా పాటిస్తున్నారని, ఈ కారణంగా సీ సెక్షన్ ప్రసవాలు పెరిగాయని వైద్యులు చెప్పుకొస్తున్నారు. గర్ణిణీలకు నొప్పులు రాగానే.. సర్జరీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. సాధారణ ప్రసవానికి ఓపిక అవసరం, ప్రసవానికి 24 గంటల సమయం పడుతుంది. కానీ కుటుంబ సభ్యులు సహకరించడం లేదని ఫలితంగా ఆపరేషన్ చేయాల్సి వస్తోందని వివరిస్తున్నారు. సిజేరియన్ల కారణంగా..పిల్లలు ముర్రు పాలకు దూరమవుతున్నారని .. అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని చెబుతున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో ముహుర్తపు కాన్పులను నిలిపి వేశామని వైద్యులు చెబుతున్నారు.

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్లు సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యశాఖ సాధారణ ప్రసవాలు పెంచాలని ప్రకటనలతో సరిపెట్టకుండా.. ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా పెంచాలని కోరుతున్నారు జిల్లా వాసులు. ఇటు మహుర్తపు కాన్పులకు తగ్గించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Siddu Jonnalagadda: డీజే టిల్లు కండిషన్లు.. అవాక్కవుతున్న డైరెక్టర్లు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • area
  • Astrology
  • Business
  • c sections
  • date

తాజావార్తలు

  • Food poisoning: బిర్యానీ, వాటర్‌మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?

  • Dhanush: రామ్ చరణ్‌ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..

  • Gudivada Amarnath: డేటా సెంటర్‌పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!

  • Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!

  • Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions