Run For Peace: బొటానికల్ గార్డెన్ లో రన్ ఫర్ పీస్.. నిర్వాహకులకు ఎంపీ సంతోష్ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాంధీ జయంతి నాడు బొటానికల్ గార్డెన్ లో నిర్వహించిన రన్ ఫర్ పీస్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వాహకుల్ని అభినందించారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10K, 5K, 3K రన్ ఫర్ పీస్ లో వేలాదిమంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్ నిర్వహించడం చాలా శుభ పరిణామం అని దీనికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
Read Also: Mla Jaggareddy: VRAలకు దసరా గిఫ్ట్ ఇవ్వండి కేసీఆర్
Also Read
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
ప్రతిరోజు ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండే మనం వ్యాయామం చేయడం మర్చిపోతున్నామని కానీ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ గార్డెన్ అభివృద్ధి కోసం అసోసియేషన్ వారు చాలా కృషి చేస్తున్నారని వారికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ గార్డెన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల కోసం తన రాజ్యసభ నిధులనుండి 10 లక్షల రూపాయలను కేటాయిస్తున్నానని తెలియజేశారు. సంతోష్ ప్రకటనను స్ఫూర్తిగా తీసుకొని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రెడ్డి, స్థానిక శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి కూడా వారి అభివృద్ధి నిధుల నుండి తలా 10 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ సందర్భంగా అందరు కలిసి పార్కు అభివృద్ధి కోసం 40 లక్షల నిధులు ఇచ్చిన వారందరికీ వాకర్స్ అసోసియేషన్ వారు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, స్పోర్ట్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, PCCF డోబ్రియాలు, వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు భరత్ రెడ్డి, బాలకృష్ణ ఏవీ రెడ్డి, పెద్ద ఎత్తున వాకర్స్ పాల్గొన్నారు.
Read Also: Maharashtra: హలోకు బదులు “వందేమాతరం”.. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రచారం
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!