దేశంలోని పేద వాడికి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పధకం అమలు చేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ మండి పడ్డారు. మహబూబాబాద్ జిల్లా లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. భారత దేశం అన్ని మతాల కులాల వేదికగా నిలిచిందన్నారు. భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ దేశ సంపద అంతయు కొంతమంది చేతుల్లో పెడుతున్నారని మండి పడ్డారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ లెవలేని స్థితిలో ఉందని ఎద్దేవ చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ శూన్యతను గుర్తించి కేసీఆర్ జాతీయ పార్టీని పెడుతున్నాడని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఆకలి చావులు ఉన్న మత పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రల్లో విద్యుత్ కోతలు ఉన్న తెలంగాణలో లేదని గుర్తు చేశారు. బీజేపీ కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పుతున్నడని అన్నారు. దేశాన్ని దోచుకోవడమే పనిగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని మండి పడ్డారు. కేసీఆర్ నిర్ణయానికి అనేక పార్టీలు మద్ధతు ఇస్తున్నాయని మంత్రి అన్నారు. గిరిజన రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రంలో బీజేపీ ఆమోదం తెలపడం లేదని నిప్పులు చెరిగారు.
తండాలను, గుడాలను పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ దే అని మంత్రి కొనియాడారు. గిరిజన యూనివర్సిటీ కోసం 350 ఎకరాల స్థలాన్ని కేటాయించిన నేటి వరకు కేంద్రం నిధులు ఇవ్వలేదని మంత్రి ఈ సంద్భంగా మండిపడ్డారు.
Jobs: నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త.. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల భర్తీ
