అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శిశువిహార్ పిల్లల కోసం ప్రత్యేకంగా నిలోఫర్ ఆసుపత్రిలో వార్డు ఏపాటు చేసారు. ఈ విషయం పై మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… 10 బెడ్స్ తో కూడిన వార్డ్ ఏర్పాటు చేసాం. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట వేశారు. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 10 వేల కోట్లను ఖర్చు పెట్టనున్నారు. కోవిడ్ లో వైద్యలు ప్రాణాలకు తెగించి పని చేసారు.. ఇక ముందు కూడా అలాగే పని చేయాలి అని ఆవిడ కోరారు. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతునందుకు గిరిజన బిడ్డగా గర్వపడుతున్నాను అని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖకే కేసీఆర్ పెద్దపీట…
