Ponnam Prabhakar: గత ప్రభుత్వం మాదిరిగానే మేము ఇస్తాం.. రైతుపెట్టుబడి పై పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: రైతులకు పెట్టుబడి సహాయాన్ని గత ప్రభుత్వం ఏ మాదిరిగా ఇచ్చిందో అదే మాదిరిగా మేము ఇస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మాట్లాడుతున్నారు. గ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను నెరవేర్చామన్నారు. రవాణా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని తెలిపారు. కొంతమంది మాజీ మంత్రులు ఈ ప్రభుత్వాన్ని నడవనీయమంటున్నారని మండిపడ్డారు. రైతులకు పెట్టుబడి సహాయాన్ని గత ప్రభుత్వం ఏ మాదిరిగా ఇచ్చిందో అదే మాదిరిగా మేము ఇస్తామన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన ఏనాడు ప్రజలను కలిసేవాడు కాదన్నారు. ప్రగతి భవన్ ని గతంలో చూడని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు చూడవచ్చని అన్నారు. విద్యుత్ శాఖలో 85 వేల కోట్ల అప్పు ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి శాఖ పై శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన నచ్చక కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారని తెలిపారు. ప్రజా సమస్యలపై గత ప్రభుత్వంలో పాలకులను, అధికారులను కలిసే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు కానీ… మాకు సమస్యలు పరిష్కరించే సమయం ఇవ్వాలని కోరారు.
Read also: Revanth Reddy: జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. చర్చగా మారిన అంశం..!
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
ఈ నెల 3న ఎన్నికల ఫలితాలు వెలువడితే 9న 6 గ్యారంటీలలో 2 హామీలు ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచారు. ఇచ్చినట్లుగానే 100 రోజుల్లో 6 హామీలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని నడపలేమని ప్రతిపక్షాలు చెబుతున్నాయన్నారు. గతంలో ఇచ్చినట్లే రైతుబంధు ఇస్తామని చెప్పిన మంత్రి పొన్నం గజ్వేల్ నుంచి గెలిచి ఒక్కసారి కూడా ఇక్కడి ప్రజలను కలవలేదన్నారు. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చారని పేర్కొన్నారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాస్వామిక పాలన అందిస్తామని, భూ నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుబంధు లోపాలను సవరించి వీలైనంత త్వరగా రైతుబంధు నగదును అందజేస్తామని పొన్నం ప్రభాకర్ వివరించారు.
YSR Law Nestham: వైఎస్సార్ లా నేస్తం నిధుల విడుదల.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్
తాజావార్తలు
-
APL 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం
-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
-
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
-
Home Cleaning Tips : ఇంట్లో దుర్వాసన వస్తోందా? కారణం ఇదే కావచ్చు.. ఈ చిన్న మార్పులతో ఇల్లు రోజంతా ఫ్రెష్గా ఉంటుంది!
-
Vastu Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 4 విషయాలు కనిపిస్తే రోజంతా పాజిటివ్గా ఉంటారా? వాస్తు ఏమి చెబుతోంది?
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!