Site icon NTV Telugu

KTR Tweet: కేంద్రమంత్రి గారు.. వీటికీ సమాధానం చెప్పండి.. నిర్మల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేటీఆర్

Ktr

Ktr

KTR Tweet: తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన విమర్శలపై మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అప్పులపై మాట్లాడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్రం అప్పులపై కూడా స్పందించాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఆర్థిక అంశాల్లో నిపుణురాలైన నిర్మలా సీతారామన్‌ తాను చెబుతున్న అంశాలను కూడా ప్రసంగాల్లో ప్రస్తావించాలని కేటీఆర్ అన్నారు. 67 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో 2014 ముందు వరకు 14 మంది ప్రధానులు మారారని.. అప్పటికి దేశ అప్పు రూ.56 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. అదే మోడీ ప్రధాని అయ్యాక గత 8 ఏళ్లలో అప్పు రూ.100 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. దీనివల్ల దేశంలో ప్రతి ఒక్కరిపై అప్పు రూ.1.25 లక్షలకు చేరిందని చెప్పారు. జీఎస్‌డీపీలో అప్పుల నిష్పత్తిని చూస్తే.. తెలంగాణ చాలా మెరుగ్గా ఉందని ట్వీట్‌ ద్వారా తెలిపారు.

Chada Venkat Reddy: మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం కూనీ అయ్యింది..

తెలంగాణ జీఎస్డీపీ 23.5 శాతమేనని.. దేశంలోని 28 రాష్ట్రాల్లో 23వ స్థానంలో ఉందని వివరించారు. అదే దేశ అప్పులు, జీడీపీ నిష్పత్తి 59 శాతమని గుర్తు చేశారు. అంటే తెలంగాణ అప్పులే తక్కువని స్పష్టం చేశారు. భారత్‌లో కేవలం 2.5 శాతం జనాభా కలిగిన తెలంగాణ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉందని.. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అంత మెరుగ్గా పనిచేస్తే భారతదేశం 4.6 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి ఎదిగి ఉండేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశానికి కావాల్సినవి పాడైపోయిన డబుల్ ఇంజన్లు కావని.. డబుల్ ఇంపాక్ట్ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

 

Exit mobile version