NTV Telugu Site icon

Harish Rao: శ్రీజ మోములో నూరేళ్లు చిరునవ్వు వెళ్లి విరియాలి.. మంత్రి హరీష్ రావు

Minister Harish Rao

Minister Harish Rao

Harish Rao: శ్రీజ మోములో నూరేళ్లు చిరునవ్వు వెళ్లి విరియాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శిశుగృహాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శిశుగృహలో మానవీయ కోణం ఆవిష్కృతమైందన్నారు. శిశు గృహలో అనాధ శిశువులను హరీష్ రావు పరిశీలించారు. ఈ క్రమంలో 3 నెలల చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా శిశుగృహ ఆయాల చేతిలో ఆడుకుంటూ కనబడింది. అక్కడకు వెళ్లిన మంత్రి స్వయంగా తన చేతిల్లో తీసుకుని ముద్దులోలుకుతున్న ఆ చిన్నారికి శ్రీజ అని పేరు పెట్టారు. శ్రీజ ముఖంలో ఎప్పటికి చిరునవ్వులు తొలగని విధంగా తల్లిదండ్రులు లేని లోటు కనబడకుండా పెంచాలని అన్నారు. శ్రీజ ఆనందంగా పెరిగి పెద్దదై నిండునూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించేలా శిశు గృహ అధికారులు ఉన్నంతంగా తీర్చిదిద్దాలని ఆశీర్వదించారు.

తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు నోచుకోని ఇలాంటి అనాధ పిల్లల సేవచేయడం ప్రజా ప్రతినిధులుగా మాకు చాలా సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. అనాధ శిశువులందరినీ శిశు గృహ అధికారులు సొంత బిడ్డల లాగా చూసుకోవాలని మంత్రి అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి శివారులో నిరుపేద తల్లి 3 నెలల శ్రీజను విక్రయిస్తుండగా జిల్లా బాలల సంరక్షణ అధికారులు తల్లి నుండి చిన్నారిని తీసుకొని లీగల్ గా శిశు గృహలో చేర్పించి అలనా పాలన చూస్తున్న వీరందరి అభినందించారు. చిన్నారులను కంటిరెప్పలా కాపాడాలని సూచించారు. శ్రీజ చిరునవ్వు ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట నంగునూరు మండలం ముండ్రాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో బ్యాంకు సేవలు ఉంటాయని తెలిపారు. అందరికీ సంక్షేమం, అభివృద్ధి సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
Tamilisai: మోడీ నాయకత్వంతోనే మహిళ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది..! గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు