Metro MD NVS Reddy: ఫేస్ 2 కోసం రెండు డీపీఆర్లు పంపాం.. కేంద్రం నిర్ణయం కోసం వెయిటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Metro MD SVS Reddy Reveals Metro Phase 2 Details: హైదరాబాద్ మెట్రో ఫేస్-2 కోసం తాము రెండు డీపీఆర్లను కేంద్రానికి పంపామని.. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆలోపు రూ.6250 కోట్ల బడ్జెట్తో రాయ్దుర్గ్ నుంచి శంషాబాద్ వరకూ మెట్రో లైన్ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని అన్నారు. బయో డైవర్సిటీ దగ్గర థర్డ్ లెవెల్లో మెట్రో లైన్ వెళ్తుందన్నారు. అనంతరం ఖాజాగుడా మీదుగా వెళ్లి, నానక్రామ్ గూడ దగ్గర ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) దగ్గరకు వెళ్తుందన్నారు. ఓఆర్ఆర్ పక్క నుంచి నార్సింగి, రాజేంద్ర నగర్ దాటి శంషాబాద్కు మెట్రో మార్గం వెళ్తుందన్నారు. శంషాబాద్ దగ్గర అండర్ గ్రౌండ్ టచ్ అవుతుందని.. ఎయిర్పోర్ట్ దగ్గర రెండు స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్టుకు లగేజ్ బ్యాగులు తీసుకెళ్లే బాధ ప్రయాణికులకు లేకుండా.. స్టేషన్ నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభోత్సవం సమయంలోనే ఈ విషయంపై తనకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. ఎయిర్పోర్ట్ ఉన్న చోటే.. అండర్గ్రౌండ్లో మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎస్కలేటర్స్, లిఫ్ట్స్, స్టెప్స్ ద్వారా.. నేరుగా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఫ్లోర్కి చేరుకుంటారన్నారు. ఫస్ట్ ఫేస్లో స్టేషన్ల విషయంలో తాము 370 కేసుల్ని ఎదుర్కున్నామని.. చాలామంది తమని రకరకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా తమపై కేసులు పెట్టేందుకు సిద్ధంగానే ఉన్నారని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకొని.. స్టేషన్ల లొకేషన్లను ఫిక్స్ చేస్తామని, ప్రయాణికులు నేరుగా కాలనీలోకి వెళ్లేలా స్కై వాకర్స్ నిర్మించేలా ప్లాన్స్ చేస్తున్నామన్నారు.
Also Read
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
ప్రస్తుతమున్న మెట్రోతో పోలిస్తే.. ఎయిర్పోర్ట్కు వేస్తున్న మెట్రోలో వేగం ఎక్కువగా ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు మెట్రో హైస్పీడ్ 80 కిలోమీటర్లు కాగా.. ఎయిర్పోర్ట్కి వేస్తున్న మెట్రో హైస్పీడ్ 120 కిలోమీటర్ల వరకు ఉంటుందని అన్నారు. ఈ స్పీడుతో 31 కిలోమీటర్ల దూరాన్ని 26 నిమిషాల్లోనే చేరుకోవచ్చన్నారు. దీనికితోడు స్టేషన్లు కూడా తక్కువగా ఉంటాయని తెలిపారు. ఇక మెట్రో ఫేస్-1లో భాగంగా.. 69 కిలోమీటర్లు పీపీపీ విధానంలో పూర్తి చేశామని ఎస్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల్లో మెట్రోలో 31.5 కోట్ల మంది ప్యాసింజర్లు ప్రయాణించారన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “నువ్వు గ్రేట్ రా బుడ్డోడా”.. కెప్టెన్ తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్..
-
Janhvi Kapoor : బాయ్ ఫ్రెండ్ తో మ్యారేజ్ ఫిక్సా? వైరల్ ఫొటోతో వార్తల్లోకి జాన్వీ పెళ్లి
-
ToxicTheMovie : వాయిదాల పర్వం ముగిసింది.. టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చింది
-
Motorola Edge 70 Fusion: 7000mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్తో.. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ కొత్త వేరియంట్ విడుదల
-
Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!