Metro MD NVS Reddy: ఫేస్ 2 కోసం రెండు డీపీఆర్లు పంపాం.. కేంద్రం నిర్ణయం కోసం వెయిటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Metro MD SVS Reddy Reveals Metro Phase 2 Details: హైదరాబాద్ మెట్రో ఫేస్-2 కోసం తాము రెండు డీపీఆర్లను కేంద్రానికి పంపామని.. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆలోపు రూ.6250 కోట్ల బడ్జెట్తో రాయ్దుర్గ్ నుంచి శంషాబాద్ వరకూ మెట్రో లైన్ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని అన్నారు. బయో డైవర్సిటీ దగ్గర థర్డ్ లెవెల్లో మెట్రో లైన్ వెళ్తుందన్నారు. అనంతరం ఖాజాగుడా మీదుగా వెళ్లి, నానక్రామ్ గూడ దగ్గర ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) దగ్గరకు వెళ్తుందన్నారు. ఓఆర్ఆర్ పక్క నుంచి నార్సింగి, రాజేంద్ర నగర్ దాటి శంషాబాద్కు మెట్రో మార్గం వెళ్తుందన్నారు. శంషాబాద్ దగ్గర అండర్ గ్రౌండ్ టచ్ అవుతుందని.. ఎయిర్పోర్ట్ దగ్గర రెండు స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్టుకు లగేజ్ బ్యాగులు తీసుకెళ్లే బాధ ప్రయాణికులకు లేకుండా.. స్టేషన్ నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభోత్సవం సమయంలోనే ఈ విషయంపై తనకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. ఎయిర్పోర్ట్ ఉన్న చోటే.. అండర్గ్రౌండ్లో మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎస్కలేటర్స్, లిఫ్ట్స్, స్టెప్స్ ద్వారా.. నేరుగా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఫ్లోర్కి చేరుకుంటారన్నారు. ఫస్ట్ ఫేస్లో స్టేషన్ల విషయంలో తాము 370 కేసుల్ని ఎదుర్కున్నామని.. చాలామంది తమని రకరకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా తమపై కేసులు పెట్టేందుకు సిద్ధంగానే ఉన్నారని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకొని.. స్టేషన్ల లొకేషన్లను ఫిక్స్ చేస్తామని, ప్రయాణికులు నేరుగా కాలనీలోకి వెళ్లేలా స్కై వాకర్స్ నిర్మించేలా ప్లాన్స్ చేస్తున్నామన్నారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ప్రస్తుతమున్న మెట్రోతో పోలిస్తే.. ఎయిర్పోర్ట్కు వేస్తున్న మెట్రోలో వేగం ఎక్కువగా ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు మెట్రో హైస్పీడ్ 80 కిలోమీటర్లు కాగా.. ఎయిర్పోర్ట్కి వేస్తున్న మెట్రో హైస్పీడ్ 120 కిలోమీటర్ల వరకు ఉంటుందని అన్నారు. ఈ స్పీడుతో 31 కిలోమీటర్ల దూరాన్ని 26 నిమిషాల్లోనే చేరుకోవచ్చన్నారు. దీనికితోడు స్టేషన్లు కూడా తక్కువగా ఉంటాయని తెలిపారు. ఇక మెట్రో ఫేస్-1లో భాగంగా.. 69 కిలోమీటర్లు పీపీపీ విధానంలో పూర్తి చేశామని ఎస్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల్లో మెట్రోలో 31.5 కోట్ల మంది ప్యాసింజర్లు ప్రయాణించారన్నారు.
తాజావార్తలు
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
-
Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!