Meerpet Aya Murder: హైదరాబాద్ మీర్పేట్లో స్కూల్ ఆయా కమలమ్మ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కేవలం రూ. 10,000 నగదు, ఆమె ధరించిన అర తులం బంగారు కమ్మల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న ‘శ్రీకృష్ణ హాట్ చిప్స్’ యజమాని ప్రకాష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్లో జీతం తీసుకుని ఇంటికి వెళ్తున్న కమలమ్మను నిందితుడు ప్రకాష్ మాటల్లో దింపి షాపులోకి పిలిచాడు. షాపులోకి వెళ్లిన ఆమె మళ్లీ బయటకు రాకపోవడాన్ని గమనించిన పోలీసులు సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆపై మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి పక్కనే ఉన్న బిల్డింగ్ సంపులో పడేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు.

