ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను ప్రకటించింది. 9 రాష్ట్రాలకు కొత్త ఇన్ ఛార్జులను ప్రకటించిన కాంగ్రెస్ ఈమేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా కొనసాగుతున్న దీపా దాస్ ను తొలగించింది ఏఐసీసీ. తెలంగాణకు కొత్త ఇంచార్జిని నియమించింది. తెలంగాణకు కాంగ్రెస్ ఇంచార్జిగా మీనాక్షి నటరాజన్ ను నియమించింది. మీనాక్షి నజరాజన్ 2009లో మధ్యప్రదేశ్ లోని మాండసోర్ నుంచి ఎంపీగా పని చేశారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాల కాంగ్రెస్ కు కొత్త ఇన్ ఛార్జులు.. పంజాబ్, జమ్ము కశ్మీర్ కొత్త జనరల్ సెక్రటరీలను నియమించింది.
AICC: కాంగ్రెస్ ఇంచార్జిగా దీపా దాస్ అవుట్.. పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను ప్రకటించిన ఏఐసీసీ
- ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను ప్రకటించింది.
- 9 రాష్ట్రాలకు కొత్త ఇన్ ఛార్జులను ప్రకటించిన కాంగ్రెస్
- ఈమేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది
![Natarajan](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2025/02/natarajan-1024x576.jpg)
Natarajan