IPL 2025: క్రికెట్ లవర్స్కి బ్యాడ్న్యూస్.. ఇకపై ఐపీఎల్ మ్యాచ్లను ఉచితంగా చూడలేరు..
- మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్
- ఇంతలో ఐపీఎల్ వీక్షకులకు భారీ షాక్
- ఐపీఎల్ చూడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అది ముగిసిన వెంటనే, ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెట్ లీగ్ అంటే ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు చేదు వార్త వచ్చింది. గత సీజన్ వరకు, అభిమానులు జియో సినిమాలో మ్యాచ్లను ఉచితంగా వీక్షించారు. కానీ ఈ సీజన్లో అది కుదరదు. ఇప్పుడు అభిమానులు ఐపీఎల్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి డబ్బుల కట్టాల్సిందే. ఎందుకంటే.. డిస్నీ + హాట్స్టార్, జియో సినిమా IPL 2025 కి ముందు విలీనం అయ్యాయి. ఇప్పుడు రెండింటి పేర్లను కలిపి ఒక యాప్ను ప్రవేశపెట్టారు. కొత్తపేరు జియో హాట్స్టార్ గా మారింది. ఈ యాప్లో అభిమానులు కొన్ని నిమిషాలు మాత్రమే ఐపీఎల్ మ్యాచ్ను ఉచితంగా చూడగలరు.
READ MORE: Bhagwant Mann: అమెరికా విమానం అమృత్సర్కి రావడంపై పంజాబ్ సీఎం ఆగ్రహం
Also Read
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
కానీ మొత్తం మ్యాచ్ చూడటానికి మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొబైల్ ప్లాన్ ప్రారంభ ధర రూ.149 నుంచి ప్రారంభమవుతుంది. రూ.149 వ్యాలిడిటీ 3 నెలలు. సంవత్సరం మొత్తం సబ్స్క్రిప్షన్ పొందాలంటే.. రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు ప్లాను కేవలం ఫోన్కి మాత్రమే వర్తిస్తాయి. అంతే కాకుండా.. రూ.299తో ప్లాన్ తీసుకుంటే.. రెండు డివైజ్లకు సపోర్ట్ చేస్తుంది. మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ఏడాదికి పొడిగించాలంటే రూ.899 చెల్లించాలి. దీంతో పాటు మ్యాచ్ మధ్యలో ప్రకటనలు రాకుండా వీక్షించే ప్లాన్లను కూడా జియోహాట్స్టార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కూడా రెండు ప్రీమియం ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.299 సబ్స్క్రిప్షన్ తీసుకుంటే.. మూడు నెలల పాటు యాడ్స్ చేకుండా వీక్షించవచ్చు. ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1499. ఈ ప్రీమియం ప్లాన్లతో నాలుగు డివైజ్లలో కంటెంట్ను వీక్షించొచ్చు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2025 సీజన్ మార్చిలో మొదలవుతుందన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. రెండవ మ్యాచ్ గత సీజన్ రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య మార్చి 23న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!