Medigadda : మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కారు నజర్.. 20న సీఎం రేవంత్తో కలిసి మంత్రి ఉత్తమ్ పర్యటన.!
- మేడిగడ్డపై సర్కారు ఫోకస్
- 20న సీఎం రేవంత్ పర్యటన
- సాయిల్ టెస్టింగ్కు ప్రాధాన్యం
- గత ప్రభుత్వంపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు , పునరుద్ధరణ పనులపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తాను స్వయంగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) చైర్మన్ అనిల్ జైన్తో భేటీ అయిన మంత్రి, ప్రాజెక్టు తాజా పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు.
Muslim Population: 4 నుంచి 160 వరకు.. ఆ దేశంలో భారీగా పెరిగిన మజీదులు.. పెద్ద ఎత్తున నిరసనలు..
Also Read
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
గోదావరి నదికి వరదలు వచ్చేలోగానే మేడిగడ్డ వద్ద సాయిల్ టెస్టింగ్ (మట్టి పరీక్షలు) పూర్తి చేసి, అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా, మేడిగడ్డ డ్యామేజీకి సంబంధించి జరిగే సాయిల్ టెస్ట్ , డిజైన్ల ఖర్చును ప్రభుత్వం భరించబోదని, ఆయా కాంట్రాక్ట్ సంస్థలే భరించాల్సి ఉంటుందని మంత్రి తేల్చి చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. “బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. దాదాపు 97 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం ఏటా 10 వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తోంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేసినందున, దానిని ఎలాగైనా రిపేర్ చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి గానీ, తమ ప్రభుత్వానికి గానీ ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. కేవలం ప్రజల సొమ్ము వృథా కాకూడదనే ఉద్దేశంతోనే పునరుద్ధరణ పనులపై దృష్టి సారించామని చెప్పారు. సాంకేతిక నిపుణుల సలహాలు, ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా పారదర్శకంగా ముందుకు వెళ్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..