Nizamabad: చాయ్ కోసం బస్సు ఆపితే.. కెమెరాకు చేయి అడ్డుపెట్టి 13 లక్షలు కొట్టేసారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad: ఓ ప్రైవేట్ బస్సులో సినీమా స్టైల్లో చోరీ జరగడం సంచలనంగా మారింది. టీ తాగడం కోసం బస్సు ఆపితే.. అదే సమయంలో 13 లక్షలు ఉన్న బ్యాగుతో ఉడాయించారు.దీంతో బ్యాగ్ యజమాని లబోదిబో మన్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగాపూర్లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ బస్సులో భారీ చోరీ జరగడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ముంబై నుంచి జగిత్యాల వెళ్తుండగా నగర శివారులో చోరీ జరిగింది.
Read also: Palakurthy Tikkareddy: ఈ సారి మంత్రాలయం టికెట్ నాదే.. గెలుపు నాదే..
Also Read
- Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
జగిత్యాల జిల్లాకు చెందిన హన్మంతు ముంబైలోని ఓ తాడి బట్టీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆ బట్టీ యజమాని కూడా జగిత్యాలకు చెందినవాడు. సంక్రాంతి పండుగకు ముంబయి నుంచి హన్మంతు జగిత్యాలకు వస్తుండగా.. బట్టీ యజమాని హన్మంతుకు రూ.13 లక్షలు ఇచ్చి తన ఇంట్లో ఇవ్వాలని చెప్పాడు. హన్మంతు డబ్బు తీసుకుని శనివారం మధ్యాహ్నం ముంబైలోని ఓ ప్రైవేట్ బస్సు ఎక్కాడు. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలోని భవానీ హోటల్ వద్ద టీ తాగేందుకు డ్రైవర్ బస్సును ఆపాడు. అదే సమయంలో డబ్బున్న బ్యాగును సీటుపై పెట్టి హన్మంతు కిందకు దిగాడు. సుమారు అరగంట పాటు బస్సు ఆగిన తర్వాత ఇదే అవకాశంగా భావించిన దుండగులు సీటుపై ఉన్న బ్యాగుతో పరారయ్యారు.
Read also: Supreme Court: జీతం రాలేదంటూ సుప్రీంకోర్టులో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి ఆవేదన
బస్సు కదులుతుండగా హన్మంతు వచ్చి చూడగా సీటుపై డబ్బు బ్యాగ్ కనిపించలేదు. చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే బస్సు డ్రైవర్కు చెప్పి పోలీసులకు సమాచారం అందించారు. సౌత్ రూరల్ సీఐ వెంకట నారాయణ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ముసుగు ధరించిన దుండగుడు బస్సులోని సీసీ కెమెరాకు చేయి అడ్డుపెట్టి డబ్బు ఉన్న బ్యాగును తీసుకెళ్తున్నట్లు బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. నిందితులతో పాటు వచ్చిన మరో ఇద్దరు కూడా బస్సు డోర్ వద్ద నిలబడి ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆరో టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. చోరీ జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బస్సులో ప్రయాణించే వ్యక్తులు చోరీ చేశారా..? బయట వ్యక్తులు చోరీ చేశారా? అనే కోణం లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
Palakurthy Tikkareddy: ఈ సారి మంత్రాలయం టికెట్ నాదే.. గెలుపు నాదే..
తాజావార్తలు
-
Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
-
PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
-
Mamata Banerjee: “అప్పటి వరకు నేను చావను”.. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Nani: నాని కొత్త సినిమా ప్రచారం.. నిజమే లేదట!
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!