Nizamabad: చాయ్ కోసం బస్సు ఆపితే.. కెమెరాకు చేయి అడ్డుపెట్టి 13 లక్షలు కొట్టేసారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad: ఓ ప్రైవేట్ బస్సులో సినీమా స్టైల్లో చోరీ జరగడం సంచలనంగా మారింది. టీ తాగడం కోసం బస్సు ఆపితే.. అదే సమయంలో 13 లక్షలు ఉన్న బ్యాగుతో ఉడాయించారు.దీంతో బ్యాగ్ యజమాని లబోదిబో మన్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగాపూర్లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ బస్సులో భారీ చోరీ జరగడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ముంబై నుంచి జగిత్యాల వెళ్తుండగా నగర శివారులో చోరీ జరిగింది.
Read also: Palakurthy Tikkareddy: ఈ సారి మంత్రాలయం టికెట్ నాదే.. గెలుపు నాదే..
Also Read
- Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
జగిత్యాల జిల్లాకు చెందిన హన్మంతు ముంబైలోని ఓ తాడి బట్టీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆ బట్టీ యజమాని కూడా జగిత్యాలకు చెందినవాడు. సంక్రాంతి పండుగకు ముంబయి నుంచి హన్మంతు జగిత్యాలకు వస్తుండగా.. బట్టీ యజమాని హన్మంతుకు రూ.13 లక్షలు ఇచ్చి తన ఇంట్లో ఇవ్వాలని చెప్పాడు. హన్మంతు డబ్బు తీసుకుని శనివారం మధ్యాహ్నం ముంబైలోని ఓ ప్రైవేట్ బస్సు ఎక్కాడు. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలోని భవానీ హోటల్ వద్ద టీ తాగేందుకు డ్రైవర్ బస్సును ఆపాడు. అదే సమయంలో డబ్బున్న బ్యాగును సీటుపై పెట్టి హన్మంతు కిందకు దిగాడు. సుమారు అరగంట పాటు బస్సు ఆగిన తర్వాత ఇదే అవకాశంగా భావించిన దుండగులు సీటుపై ఉన్న బ్యాగుతో పరారయ్యారు.
Read also: Supreme Court: జీతం రాలేదంటూ సుప్రీంకోర్టులో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి ఆవేదన
బస్సు కదులుతుండగా హన్మంతు వచ్చి చూడగా సీటుపై డబ్బు బ్యాగ్ కనిపించలేదు. చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే బస్సు డ్రైవర్కు చెప్పి పోలీసులకు సమాచారం అందించారు. సౌత్ రూరల్ సీఐ వెంకట నారాయణ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ముసుగు ధరించిన దుండగుడు బస్సులోని సీసీ కెమెరాకు చేయి అడ్డుపెట్టి డబ్బు ఉన్న బ్యాగును తీసుకెళ్తున్నట్లు బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. నిందితులతో పాటు వచ్చిన మరో ఇద్దరు కూడా బస్సు డోర్ వద్ద నిలబడి ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆరో టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. చోరీ జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బస్సులో ప్రయాణించే వ్యక్తులు చోరీ చేశారా..? బయట వ్యక్తులు చోరీ చేశారా? అనే కోణం లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
Palakurthy Tikkareddy: ఈ సారి మంత్రాలయం టికెట్ నాదే.. గెలుపు నాదే..
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!