Maoists Mulugu District: వ్యక్తిని దారణంగా చంపిన మావోయిస్టులు.. ఇన్ఫార్మర్ అంటూ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists Mulugu District: తెలంగాణలోని గిరిజనులు మెజారిటీగా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టుల ఘాతుకానికి ఒడిగట్టారు. ఇన్ఫార్మర్ నేపంతో కొండాపురం గ్రామానికి చెందిన సబక గోపాల్ అనే వ్యక్తిని బుధవారం అర్థరాత్రి దారుణంగా హత్యచేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. ఎవరైనా ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తే.. ఎవరికైనా ప్రజా కోర్టులో శిక్ష తప్పదని వెల్లడించారు. ఈ మేరకు వాజేడు ఏరియా కమిటీ పేరిట లేఖ విడుదల చేశారు. ఇన్ఫార్మర్గా వ్యవహరించే వారు పద్దతి మార్చుకోకుంటే ప్రజాకోర్టు శిక్ష తప్పదని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ములుగు జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించి 15 రోజులు గడపకముందే ఈఘటన సంచలనంగా మారింది. ఏజెన్సీలో డీజీపీ పర్యటించిన మరుక్షణం మావోయిస్టులు ఇన్ ఫార్మర్లను హత మారుస్తున్నారు. గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేయడంతో తాజా ఘటనతో ఏజెన్సీలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు.
read also: Pan Fried Chicken: చికెన్ తక్కువ.. ప్రొటీన్ ఎక్కువ..
Also Read
- KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
- Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే 'కమలం' వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
బుధవారం అర్థరాత్రి గోపాల్ ఇంట్లో ఉన్న సమయంలో ఐదుగురు అనుమానితులు ఇంట్లో చొరబడ్డారని వారిని చూసి గోపాల్ బయటకు పెరగెత్తగా వెంబడించిన గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి గొడ్డలితో నరికి చంపారు. అనంతరం లాల్ సలామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారని స్థానికులు పేర్కొన్నారు. మృతుడు కొండాపూర్ కు చెందిన వాడిగా గుర్తించారు పోలీసులు.మృతుడికి ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరించడంతోనే హత్య చేసినట్లు వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. 15రోజుల క్రితం మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో డీజీపీ మహేందర్రెడ్డి తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దల్లో పర్యటించి పోలీసులను అప్పమత్తం చేసిన విషయం తెలసిందే.. అయినప్పటికి ఇలా హత్య జరగడం ఎజెన్సీలో కలకలం రేపుతోంది. మరి దీనిపి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!